Home » పూరీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్న బెల్లంకొండ..!

పూరీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్న బెల్లంకొండ..!

by Azhar
Published: Last Updated on

బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే ఈయన సినిమాలు ఇక్కడ తెలుగులో భారీ హిట్ కాకపోయినా ఒక్క మాదిరిగా ఆడేవి. కానీ అవే సినిమాలను హిందీ డబ్బింగ్ తో యూట్యూబ్ లో విడుదల చేస్తే మాత్రం భారీ వ్యూస్ అనేవి వచ్చేవి. 100 మిలియన్ 200 మిలియన్ వ్యూస్ ను అందుకున్నాయి. అయితే అదే ధైర్యంతో ఇక్కడ తెలుగులో ఇంకా హీరోగా సెటిల్ కాకముందే హిందీ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

అంది కూడా ఏ కొత్త సినిమానో కాకుండా 2005 లో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇది పెద్ద చర్చగా మారింది. కానీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయినా ఇప్పుడు మరి రీమేక్ సినిమా చేయబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. అది కూడా తెలుగులో 2012 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్ మేన్ మూవీ.

అయితే బిజినెస్ మేన్ ఇక్కడ ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిందే. దీనిని హిందీలో చేయాలనీ అప్పుడే డిమాండ్ వచ్చింది. కానీ అది కుదరలేదు. కానీ ఇప్పుడు బెల్లంకొండ 10 ఏళ్ళ తర్వాత దీని రీమేక్ కు పూనుకున్నారు. అయితే బిజినెస్ మేన్ సినిమా కథ అనేది ఎప్పటికి పాతది కాదు అనే కామెంట్స్ ఉన్నాయి. కాబట్టి దీనిని బెల్లంకొండ శ్రీనివాస్ కరెక్ట్ గా తీస్తే ఇప్పుడు కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేది తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

భారత్ – పాక్ మ్యాచ్ : ఆఫ్రిది చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

తాత్కాలిక కోచ్ గా లక్ష్మణ్ కే బాధ్యతలు..!

Visitors Are Also Reading