Home » రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో?

రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో?

by Bunty
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా జిల్ ఫేం రాధా కృష్ణ ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న సినిమా రాధేశ్యామ్. పీరియాడిక్ ల‌వ్ స్టోరీ క‌థాంశం తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. అంతే కాకుండా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రెంజ్ లో వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక గా జ‌న‌వ‌రి 14 న విడుద‌ల కాబోతుంది. దీంతో రాధేశ్యామ్ చిత్ర బృందం ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్స్ కార్యక్ర‌మాల‌ను ప్రారంభించింది. అయితే ఈ రోజు హైద‌రాబాద్ లోని రామోజీ ఫిల్మా సిటీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తున్నారు. అలాగే ఇదే వేదిక పై రాధేశ్యామ్ ట్రైల‌ర్ ను కూడా విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియా లో తెగ చెక్క‌ర్లు కొడుతుంది.

Advertisement

Advertisement

ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈ వెంట్ కు యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి యాంక‌ర్ గా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. కాగ న‌వీన్ పొలిశెట్టి చేసిన రెండు సినిమా ల‌తో సూప‌ర్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు. ఎజెంట్ సాయి శ్రీ‌నివాస్ అత్రెయ తో పాటు జాతి ర‌త్నాలు సినిమా తోనే న‌వీన్ పొలిశెట్టి తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర అయ్యాడు. అలాగే జాతి ర‌త్నాలు సినిమా స‌మ‌యంలో.. జాతి ర‌త్నాల ట్రైల‌ర్ ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. అప్ప‌టి నుంచి ప్ర‌భాస్, న‌వీన్ పొలిశెట్టి మ‌ధ్య స్నేహం ఏర్పాడింది. అందు వ‌ల్ల రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు న‌వీన్ పొలిశెట్టి హోస్ట్ గా మారాడ‌ని స‌మాచారం.

Visitors Are Also Reading