Home » అమ్మాయి అందంగా ఉందని ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు…! కానీ చివరికి ట్విస్ట్ ఏంటంటే..?

అమ్మాయి అందంగా ఉందని ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు…! కానీ చివరికి ట్విస్ట్ ఏంటంటే..?

by AJAY
Ad

ఇటీవల కాలంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా 54 ఏళ్ల మహిళ 30 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకుని మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యువతి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న యువకుడిని మోసం చేసింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే….. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు ఇంజనీరింగ్ పూర్తి చేసి మోటో కంట్రోలర్ మెకానిక్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

Advertisement

శ్రీనివాస్ తండ్రి పోలియోతో బాధపడుతుండగా తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే కొంతకాలం క్రితం శ్రీనివాస్ కు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి ద్వారా ఓ పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చడంతో బంధువులు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది.

Advertisement

ఇక అమ్మాయి పేద కుటుంబమని చెప్పడం… తండ్రి లేకపోవడంతో శ్రీనివాస్ పెళ్లికి రెండు లక్షల ఖర్చు చేసే బంగారాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులకి అందజేశాడు. రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ తమ గ్రామంలో రిసెప్షన్ ఘనంగా నిర్వహించాడు. దాదాపు రిసెప్షన్ కు 6 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకున్నాడు. కాగా పెళ్లయిన నాటినుండి శ్రీనివాస్ భార్య ప్రియ అతడికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది.

ఏదో ఒక వంక చెబుతూ శ్రీనివాస్ ను దూరం పెడుతూ వచ్చింది. ఇక రీసెంట్ గా ప్రియ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వస్తానంటూ చెప్పి బయలుదేరింది. తీరా చూస్తే తిరిగి రాలేదు. దాంతో శ్రీనివాస్ ప్రియా ఇంటికి వెళ్లి ఆరా తీయగా కంగుతినే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటికే ప్రియాకు మరో వ్యక్తితో వివాహం జరిగినట్టు తెలిసింది. దాంతో తనను మోసం చేసి పెళ్లి చేసుకుంది అంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Visitors Are Also Reading