Home » కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసా?

కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసా?

by Bunty
Published: Last Updated on
Ad

కొడాలి నాని గురించి తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాజీ మంత్రి కొడాలి నానికి అంత క్రేజ్ ఉంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు కొడాలి నాని. ఇక ఇప్పుడు మాజీ మంత్రిగా అలాగే గుడివాడ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు కొడాలి నాని. అయితే గతంలో టిడిపిలో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్కు మరియు కొడాలి నాని కి మంచి సంబంధాలు ఉండేటివి. కానీ వీరి మధ్య ఇప్పుడు చాలా గ్యాప్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మలిచిన సినిమా ఆది.

kodali-nani

Advertisement

 

ఈ సినిమాను అన్ని దగ్గరుండి కొడాలి నాని చూసుకున్నాడు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత కొడాలి నాని మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి సంబంధాలు పెరిగాయి. అయితే రాజకీయాల వల్ల వీరిద్దరి మధ్య ఇప్పుడు దూరం పెరిగింది. దీనికి గల కారణాలు ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ పై తాజాగా టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ స్పందించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, తాను ముగ్గురం ఎప్పుడు.. కలుస్తూ ఉంటామని చెప్పారు దర్శకుడు వివి వినాయక్.

Advertisement

అయితే ఆది సినిమా సమయంలో… కొడాలి నాని మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ కారణం వల్లనే కొడాలి నాని కి గుడివాడ టిడిపి టికెట్ వచ్చిందని వివరించాడు వివి వినాయక్. అయితే టిడిపి నుంచి వైసీపీలోకి కొడాలి నాని వెళ్లగానే, జూనియర్ ఎన్టీఆర్ మరియు కొడాలి నాని మధ్య కాస్త గ్యాబ్ పెరిగిందని స్పష్టం చేశారు దర్శకుడు వివి వినాయక్. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… ఇదే అసలు విషయం అని తాను అనుకుంటున్నాట్లు చెప్పారు. ఇక వివి వినాయక్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి :

అశ్విన్ లీలలు.. బయటపెట్టిన స్టార్ స్పిన్నర్ భార్య !

తెలంగాణ వ్యక్తిని పెళ్లాడబోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. తమన్నా కాబోయే భర్త బ్యాగ్రౌండ్ ఇదే ?

టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా హీరో ?

Visitors Are Also Reading