Home » నందమూరి కుటుంబానికే ఎందుకు కారు ప్రమాదాలు జరుగుతున్నాయి… వారికి ఆ శాపం తగిలిందా?

నందమూరి కుటుంబానికే ఎందుకు కారు ప్రమాదాలు జరుగుతున్నాయి… వారికి ఆ శాపం తగిలిందా?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ నటుడు నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే మొదటి నుండి తారకరత్న ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. మొదట కుప్పం స్థానిక ఆస్పత్రికి చికిత్స అందించగా, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యాధునిక పరికరాలతో డాక్టర్లు తారకరత్నకు చికిత్స అందింస్తున్నారు.

Advertisement

 

అయితే నందమూరి కుటుంబానికి చెందిన వాళ్లకు వరుసగా కారు ప్రమాదాలు చోటు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. 2009 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ కు కారు ప్రమాదం జరగగా, ఆ ప్రమాదంలో తారక్ తీవ్రగాయాల పాలయ్యారు. ఆ సమయంలో తారక్ ఆసుపత్రి నుంచి ఎన్నికల ప్రచారం చేయడం గమనార్హం. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ 2014 సంవత్సరంలో కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Advertisement

2018 సంవత్సరం ఆగస్టు నెలలో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  తాజాగా నందమూరి రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలు కావడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి కుటుంబానికి ఏదైనా శాపం తగిలిందా? అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నందమూరి కుటుంబ సభ్యులు ఒకసారి జ్యోతిష్యులను సంప్రదిస్తే మంచిదని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ కామెంట్ల విషయంలో జ్యోతిష్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Read also  : సమంత హెల్త్ అప్డేట్.. పాపం రోజుకూ 4 గంటలు అలానే !

Visitors Are Also Reading