Home » వేణు స్వామి చెప్పిందే మరోసారి జరగబోతుందా..? అది ఏంటంటే…?

వేణు స్వామి చెప్పిందే మరోసారి జరగబోతుందా..? అది ఏంటంటే…?

by AJAY
Ad

జాతకాలను చాలామంది నమ్ముతారు. అయితే సినిమా వాళ్లు రాజకీయ నాయకులు మిగతా వారి కంటే కాస్త ఎక్కువగానే నమ్ముతారు. ఈ నేపథ్యంలో వాళ్ల జాతకాలు చెప్పే వారికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా జ్యోతిష్యులలో ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉంది వేణు స్వామికే అని చెప్పాలి. వేణు స్వామి సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు.

Advertisement

పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వేణు స్వామి సంచలన జ్యోతిష్యాలు చెబుతుంటారు. వేణు స్వామి చెప్పిన రెండు మూడు విషయాలు జరగడంతో ఆయన జ్యోతిష్యానికి కూడా క్రేజ్ పెరిగిపోయింది. గతంలో వేణు స్వామి సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పాడు. ఈ విషయంలో వేణు స్వామి చెప్పినట్టే జరిగింది.

Advertisement

అంతేకాకుండా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వేడు స్వామి మాట్లాడుతూ టాలీవుడ్ లో ఓ హీరో చనిపోతారు అంటూ కామెంట్ చేశారు. వేణు స్వామి చెప్పినట్టే తారకరత్న అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే వేణు స్వామి టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు అంటూ కూడా ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు.

ఇక ఇప్పుడు ఆయన చెప్పిందే జరగబోతోంది. త్వరలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది అంటూ జోరుగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దాంతో వేణు స్వామి చెప్పింది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి గురించే అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Visitors Are Also Reading