ప్రముఖ జోతిష్యుడు వేణిస్వామి ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీకి ఇప్పటివరకూ ఉన్న క్రేజ్ ఇకపై ఉండదని అన్నారు. ఖచ్చితంగా సమస్యలు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్రిల్ 2023 తరవాత నరేంద్రమోడీ జాతకంలో భారీ మార్పులు రాబోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. మోడీకి ఉన్న ప్రాభల్యం తగ్గిపోయే అవకాశం ఉందంటూ జోతిష్యం చెప్పారు. బీజేపీ ప్రభావం తగ్గతుందని రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవడం కష్టమేనని అన్నారు. 2024లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందటూ వేణూ స్వామి చెప్పారు.
venu swami on modi political career
అంతే కాకుండా పవన్ కల్యాణ్ పై కూడా వేణూ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ జాతకం ప్రకారం ఆయనకు రాజకీయాలు అచ్చిరావని అన్నాడు. అంతే కాకుండా పవన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పుతారని కూడా చెప్పారు. అయితే గతంలో వేణు స్వామి చెప్పిన విషయాలు కొన్ని జరగటంతో ఆయన జోతిష్యానికి యమ క్రేజ్ వచ్చింది. వేణు స్వామి జోతిష్యానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. నాగచైతన్య సమంత కపుల్ విడిపోతారని వేణు స్వామి గతంలోనే చెప్పారు.
Advertisement
Advertisement
ALSO READ : సమంత ఐటమ్ సాంగ్ పై రచ్చ..పరువు పోయిందంటూ మాధవీలత షాకింగ్ కామెంట్లు..!
ఆయన చెప్పినట్టుగానే జరిగింది. అంతే కాకుండా రాజకీయాల విషయానికి వస్తే ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తారని జోతిష్యం పలికారు అది కూడా వేణు స్వామి చెప్పినట్టే జరిగింది. దాంతో ఇప్పుడు వేణు స్వామి మోడీ, పవన్ రాజకీయ భవిష్యత్తుపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఓ వైపు బీజేపీ హవా కనిపిస్తుంటే మరోవైపు వేణు స్వామి బీజేపీకి ఇబ్బందులు తప్పవు అంటూ కామెంట్లు చేయడం మోడీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.