Home » ప్ర‌ధాని మోడీతో ఉపాస‌న భేటీ..కార‌ణం ఇదే..!

ప్ర‌ధాని మోడీతో ఉపాస‌న భేటీ..కార‌ణం ఇదే..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో వైస్ చైర్మెన్ ఉపాస‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసి ఆయ‌న‌తో కాసేపు ముచ్చ‌టించారు. ఉపాస‌న ఎప్పుడూ సామాజిక కార్య‌క్ర‌మాలు, సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ అంద‌రి చేత ష‌భాష్ అనిపించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విష‌యాలు చెప్పేందుకు ఉపాస‌న ఓ పోర్ట‌ల్ ను కూడా ప్రారంభించారు. ఈ పోర్ట‌ల్ ద్వారా ఎన్నో మంచి విష‌యాల‌ను షేర్ చేసారు.

upasana meets modi

upasana meets modi

అయితే ఇటీవ‌లే ఉపాస‌న ఆమె చెల్లెలి పెళ్లిలో చ‌ర‌ణ్ తో క‌లిసి సంద‌డి చేశారు. ఇక వివాహం అనంత‌రం ఉపాస‌న‌ ముంబైలోని దుబాయ్ ఎక్స్పో కోసం వెళ్లారు. ప్ర‌తి యేడాది ఉపాస‌న దుబాయ్ ఎక్స్పోకు వెళుతూ ఉంటారు. ఈ నేప‌థ్యంతోనే ఈ యేడాది కూడా దుబాయ్ ఎక్స్పోకు హాజ‌ర‌య్యారు. అయితే అక్క‌డే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసే అవ‌కాశం ఉపాస‌న‌కు ద‌క్కింది. అంతే కాకుండా ఉపాస‌న ప్ర‌ధానితో క‌లిసి ముచ్చ‌టించింది.

Advertisement

Advertisement

దీనికి సంబంధించిన ఫోటోల‌ను ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌ధాని నరేంద్ర మోడీని క‌లిసే అవ‌కాశం ద‌క్కిందని పోస్టులో పేర్కొంది. ఇక దుబాయ్ ఎక్స్పో లో మ‌హిళా సాధికార‌త‌, స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు, వ్యాధినిరోధ‌క ఆరోగ్య‌వ్య‌వ‌స్థ‌, సాంస్కృతిక ప‌రిర‌క్ష‌ణ దృష్టి సాధించ‌ద‌గ్గ అంశాలుగా ఎక్స్పో పేర్కొంద‌ని తెలిపారు. అంతే కాకుండా సాంకేతిక ప‌రిజ్ఞానం యువ‌త‌కు ఎన్నో అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంద‌ని ఆ అవ‌కాశాల‌ను యువ‌త నియోగించుకోవాల‌ని ఉపాస‌న అన్నారు.

Visitors Are Also Reading