Home » ఐటెమ్ సాంగ్స్‌లో చిందులేసిన స్టార్​ హీరోయిన్స్​ వీరే..!

ఐటెమ్ సాంగ్స్‌లో చిందులేసిన స్టార్​ హీరోయిన్స్​ వీరే..!

by Bunty
Ad

టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన సుకుమార్ ఓ అడుగు ముందుకేసీ ఈసారి ఏకంగా అల్లుఅర్జున్ హీరోగా తెర‌కెక్కిస్తున్న సినిమా పుష్ప‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలోని ఊ అంటా మావ ఉఊ అంటావా మావ అనే ప్రత్యేక గీతం తాజాగా విడుదలైంది. ఈ గీతానికి స్టార్​ హీరోయిన్​ సమంత కాలు కదిపి సినీప్రియుల చూపులను తనవైపు తిప్పుకున్న‌ది. ఈ సాంగ్​ ప్రస్తుతం కుర్రకారులను విపరీతంగా ఊపేస్తున్న‌ది. ఎక్కడ చూసిన ఇదే వినిపిస్తోంది. సోషల్​మీడియాలోనూ ఈ పాట మామూలుగా ట్రెండింగ్​ అవ్వ‌డం లేదు.

 

Advertisement

అయితే సమంత కంటే ముందే పలువురు ప్రముఖ కథానాయికలు కూడా ప్రత్యేక గీతంలో ఆడిపాడి అభిమానుల‌ను ఎంత‌గానో అలరించారు. గతంలో ఐటెమ్​ సాంగ్స్​ కోసం కొంతమంది ప్రత్యేకంగా ఆర్టిస్ట్​లు కూడా ఉండేవారు. సిల్క్​స్మిత, జయమాలిని సహా పలువురు అలనాటి తారలు ఈ ప్రత్యేక గీతాల్లో చిందులేసేవారు. ఆ త‌రువాత‌ ముమైత్​ ఖాన్​ సహా ఇంకొంతమంది వరకు కొద్ది కాలం పాటు ఈ ట్రెండ్​ కొనసాగింది. అనంతరం తమ ఫేమ్​ తగ్గిన తర్వాత రాశీ, రంభలాంటి వారు స్పెషల్​ సాంగ్స్​ చేసారు. కానీ ఆ త‌రువాత‌ క్రమక్రమంగా రూట్​ మారిపోయింది.

Advertisement

ముఖ్యంగా ఫామ్​లో ఉన్నప్పుడే స్టార్​ హీరోయిన్లు ఇలాంటివి చేసేందుకు ఆసక్తి చూపడం మొద‌లుపెట్టారు. బాలీవుడ్​లో కరీనాకపూర్​, కత్రినా కైఫ్​ లాంటి టాప్​ హీరోయిన్స్​తో మొదలైన ఈ కొత్త ట్రెండ్​ టాలీవుడ్​లోనూ కొనసాగింది. శ్రియ, తమన్నా, శ్రుతిహాసన్​, కాజల్​ ఇలా పలువురు భామలు తమ అందాలను ఆర‌బోస్తూ ఐటెం సాంగ్స్​లో కనపడి సినీ ప్రియుల‌ను కట్టిపడేసారు. హీరోయిన్​గా ఫామ్​లో ఉండగానే స్పెషల్​ సాంగ్స్​లో చిందులేసే ట్రెండ్​ శ్రియతోనే మొదలైందని చెప్పొచ్చు. రామ్​ హీరోగా నటించిన దేవదాసు చిత్రంలో జామ్​ జికిడి పాటతో అలరించిందీ ఈ భామ. ఈ సాంగ్​ అప్పట్లో కుర్రోళ్లను ఉర్రూతలూగించింది. ఆ తరువాత‌ ‘మున్నా’, ‘తులసి’, ‘పులి’ సహా పలు చిత్రాల్లో చేసింది శ్రియా. ఈ మ‌ధ్య కాలంలో త‌మ‌న్నా, పూజాహెగ్దే, స‌మంత లాంటి క‌థానాయిక‌లు ఈ సాంగ్‌ల‌లో న‌టించి మాస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు.

 

 

Visitors Are Also Reading