Home » ఫ్రిజ్ లో ఈ పదార్థాలు అస్సలు నిల్వ ఉంచకూడదు.. ఎందుకంటే..?

ఫ్రిజ్ లో ఈ పదార్థాలు అస్సలు నిల్వ ఉంచకూడదు.. ఎందుకంటే..?

by Sravanthi Pandrala Pandrala

సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్లి ఆహార పదార్థాలు, వెజిటేబుల్స్, పండ్లు లాంటివి తెచ్చుకున్నా వాటిని ముందుగా తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెడుతూ ఉంటాం. అలా ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుంటూ వాటిని ఉపయోగిస్తాం. మరి అలా ఫ్రిజ్ లో ఈ ఆహార పదార్థాలు ఉంచడం మంచిదేనా.. అలా ఉంచితే ఏం జరుగుతుంది.. అలా పెట్టిన కొన్ని ఆహార పదార్థాలు అప్పుడప్పుడు పాడైపోతూ ఉంటాయి.. మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ముఖ్యంగా తేనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

also read:ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. ఆ విభాగంలోనే..!

దీనిని ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల తినకుండా అసలు దీనికున్న గుణం కూడా పాడైపోయి చెడు ప్రభావం ఏర్పడుతుంది.అంతేకాకుండా ఫ్రిజ్ లో దోసకాయలు నిల్వ ఉంచడం వల్ల అవి నీరు గుంటలుగా మారుతాయి. కాబట్టి వీటిని ఫ్రిజ్ లో పెట్టే సమయంలో ప్లాస్టిక్ లో పెట్టి ఉంచడం మంచిది. అంతేకాకుండా ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి మెత్తగా బూజు పట్టినట్లు మారుతాయి. అందుకే వీటిని ఫ్రిజ్ లో పెట్టరాదు.ఇవే కాకుండా వెల్లుల్లి ని కూడా చల్లని పొడి ప్రదేశాల్లో ఉంచడం మంచిది.

శీతలీకరణ వల్ల అవి రబ్బర్ గా మారుతుంది. ముఖ్యంగా బంగాళదుంపలను ఫ్రిజ్ లో ఉంచితే తీయగా మారతాయి. అంతేకాకుండా అవి మొలకెత్తే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అవ్వడం చాలా హానికరం. టొమాటోలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల అవి రుచి వాసన కలిగి ఉంటాయి. కానీ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి వండుకుంటే అందులో ఉండే రసం రుచి కోల్పోతుంది. అరటి పండ్లు పండాలంటే వెచ్చని ఉష్ణోగ్రత కావాలి. ఇవి ఫ్రిడ్జ్ లో పెడితే నల్లగా మారుతాయి.

also read:

Visitors Are Also Reading