Home » ఆ మూవీలను రీ రిలీజ్ చేయమని అడుగుతున్నారు… కానీ నాకు… తేజ..!

ఆ మూవీలను రీ రిలీజ్ చేయమని అడుగుతున్నారు… కానీ నాకు… తేజ..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో తేజ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం చిత్రం, జయం, నువ్వు నేను అనే సినిమాలను చాలా తక్కువ బడ్జెట్ తో చాలా ఎక్కువ క్వాలిటీతో రూపొందించి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఈ మూవీలతో తేజ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయాడు.

Advertisement

అలా కెరియర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ఆ స్థాయి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో విఫలం అయ్యాడు. చాలా సంవత్సరాల పాటు అపజాయలను ఎదుర్కొన్న ఈ దర్శకుడు కొంత కాలం క్రితం రానా హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన నేనే రాజు నేనే మంత్రి మూవీతో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత సీత మూవీతో మరో ఆపజాన్ని అందుకున్నాడు.

Advertisement

తాజాగా ఈ దర్శకుడు అహింస అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ రేపు అనగా జూన్ 2 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా తేజకు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి నుండి మీ మూవీలలో ఏ సినిమాను ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు అని ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు తేజ సమాధానం ఇస్తూ… ఈ మధ్యకాలంలో అభిమానులు జయం, నిజం, నువ్వు నేను అలాగే నేనే రాజు నేనే మంత్రి మూవీలను రీ రిలీజ్ చేయమని అడుగుతున్నారు. దానితో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఇందులో మీరు ఏ మూవీని మొదట విడుదల చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు అని అడగ్గా… నాకు ఎలాంటి ప్లాన్ లేదు అంటూ తేజ సమాధానం ఇచ్చాడు.

Visitors Are Also Reading