నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కొందరైతే.. తమ విలక్షణమైన నటనతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని తీసుకొచ్చేవారు మరి కొందరు. ఈ జాబితాలో తనికెళ్ళ భరణి కచ్చితంగా ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి తనికెళ్లభరణి మంచి నటుడుగా గుర్తింపు సాధించారు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. హాస్యం, ఎమోషనల్, విలనిజం ఇలా ప్రతి దానిలో ఆయన తనదైన శైలిలో జీవించి చూపించారు.
తనికెళ్ళ భరణి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని పైకి ఎదిగారు. అయితే.. ఆ సమయంలోనే ఆయన కట్ అవుట్ కు చాలా ఫాలోయింగ్ ఉండేదట. ఈ విషయాన్నీ తనికెళ్ళ భరణినే స్వయంగా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్పుకొచ్చారు. తనికెళ్ళ భరణి గారు నటించిన “మాతృ దేవో భవ” సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఆయన నెగటివ్ రోల్ లో నటించారు.
Advertisement
Advertisement
ఈ సినిమాలో ఆయన పూర్తిగా జీవించేసారు. ఎంతలా అంటే.. ఒక స్టేజి లో ఆడవాళ్ళందరూ ఆయన అంటే కోపం పెంచుకునేంతలా. ఈ పాత్ర ఎంతలా ఫేమస్ అయ్యింది అంటే.. ఈ సినిమా విడుదల అయిన కొన్ని రోజులకు కొంతమంది ఆడవాళ్ళూ తనికెళ్ళ భరణి గారిని కొట్టడానికి కూడా వచ్చేశారట. అయితే.. ఆ పాత్ర అంతలా హిట్ అవ్వడంతో తనికెళ్ళ భరణి గారికి మరిన్ని అవకాశాలు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ మంచి నటుడు దొరికినట్లు అయ్యింది.
బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ?