Home » గొప్ప మనసు.. చనిపోతు నలుగురికి ప్రాణం పోసిన VRO !

గొప్ప మనసు.. చనిపోతు నలుగురికి ప్రాణం పోసిన VRO !

by Bunty
Ad

 

మానవత్వం.. ఇది చాలా గొప్ప పదం. కానీ మన మధ్య ఉన్న చాలామంది ప్రజలకు మానవత్వం అనేది లేకుండా పోయింది. పక్కవాడికి ఏం జరిగితే నాకేంటి అనేటట్లుగానే… జనాలు వ్యవహరిస్తున్నారు. పక్కవాడు చనిపోయిన సరే… నా పని నేను చేసుకుంటా అన్నట్లుగానే చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం మానవత్వాన్ని చాటుకొని గొప్ప మనుషులుగా ఎదుగుతున్నారు. అచ్చం అలాగే…. ఏపీకి చెందిన వీఆర్వో తన గొప్ప మనసు చాటుకుంది. తాను చనిపోతూ కూడా ఓ నలుగురికి ప్రాణం పోసింది ఏపీకి చెందిన మౌనిక అనే విఆర్వో.

VRO who gave life to four dying people

VRO who gave life to four dying people

ఈ సంఘటన అసలు వివరాల్లోకి వెళితే… శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన వీఆర్వో మౌనిక 23 సంవత్సరాలు. అయితే ఈ నెల 23వ తేదీన… ఉద్యోగానికి వెళుతూ స్కూటీపై నుంచి కింద పడిపోయింది. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ సంఘటనలో వీఆర్వో మౌనిక తలకు తీవ్ర గాయాలు కావడం అందరిని కలవరపరిచింది.

Advertisement

Advertisement

దీంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్. బ్రెయిన్ డెడ్ కారణంగా వీఆర్వో మౌనిక మరణించినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే కుటుంబ సభ్యులు… మౌనిక అవయవాలు దానం చేశారు. మౌనికకు సంబంధించిన గుండె కిడ్నీలు కండ్లను ఈ నేపథ్యంలో డాక్టర్లు తీసుకున్నారు. అలా మౌనిక అవయవాలు నలుగురికి ప్రాణం పోసినట్లు అయ్యాయి. ఇప్పుడు ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading