Home » Sri Reddy: నేను చచ్చిపోతా జగనన్న.. రాత్రంతా నిద్ర లేదు..!

Sri Reddy: నేను చచ్చిపోతా జగనన్న.. రాత్రంతా నిద్ర లేదు..!

by Sravya
Ad

Sri Reddy: ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం హీటెక్కిపోయింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా వివాదాస్పద నటి యూట్యూబర్ శ్రీరెడ్డి జగన్ దాడి పై రియాక్ట్ అయ్యారు.

jagansrireddy

Advertisement

సోషల్ మీడియాలో జగన్ వైసీపీ పార్టీకి మద్దతుగా శ్రీరెడ్డి తరచూ వీడియోలు చేస్తున్న విషయం మనకి తెలుసు. తాజాగా జగన్ మీద రాళ్లదాడి గురించి శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు. జగన్ పై దాడిని ఖండిస్తూ ఇటువంటి నీచమైన పనులకి తెగబడుతున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

Also read:

దాడి వెనుక టిడిపి నేత బోండా ఉమా ఉన్నట్లు శ్రీరెడ్డి ఆరోపించారు. ఈ ఘటన మీద మాట్లాడుతూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశారు. ఎన్నో కోట్ల మందికి ప్రాణమైన వ్యక్తి మీద హత్యాయత్నం చేస్తారా..? అసలు మీరంతా మనుషులేనా..? మనిషికి హాని తలపెట్టే అంత కోపమా..? ఆయన వెనుక జనం వున్నారని జీర్ణించుకోలేక ఇటువంటి పని చేస్తారా..? జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు బతుకుతున్నాయో మీకు తెలుసా ఆయన రాష్ట్రానికి ఎంత ముఖ్యమో మీకు తెలుసా..?

Advertisement

Also read:

మీ పదవుల కోసం జగనన్న ఇంత హాని తల పెడతారా అంటూ శ్రీరెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికి ఫేస్ బుక్ లో కూడా ఒక పోస్ట్ ని శ్రీ రెడ్డి పెట్టారు. నేను చచ్చిపోతాను జగనన్న నేను బతకలేను. మీరంటే అంత పిచ్చి అని ఆమె పోస్ట్ చేసింది. ఇప్పటికే ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తోంది పోలీస్ శాఖ. ముఖ్యమంత్రి పైన ఇలా దాడి జరగడం నేషనల్ వైడ్ గా సంచలనం రేపుతోంది. నరేంద్ర మోడీతో పాటుగా పలువురు రాజకీయ పార్టీల నేతలు కూడా జగనన్న జాగ్రత్త అని పోస్ట్ లు పెట్టారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading