Home » ఒక వ్యక్తి చనిపోయే ముందు కనపడే సంకేతాలు ఇవే..!

ఒక వ్యక్తి చనిపోయే ముందు కనపడే సంకేతాలు ఇవే..!

by Sravya
Ad

ఏదైనా జరగడానికి ముందు కొన్ని సంకేతాలు కనబడుతూ ఉంటాయి. మంచైనా చెడైనా కూడా మనకి కొన్ని సంకేతాలు కనపడుతూ ఉంటాయి. మీ వినడానికి ముందు ఈ సంకేతాలు కనబడతాయని గరుడ పురాణం చెప్తోంది. మరి మరణానికి ముందు కనపడే సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గరుడ పురాణం లో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకునేటప్పుడు అతని కి కొన్ని కనబడుతూ ఉంటాయి. కుటుంబాన్ని విడిచిపెట్టి చనిపోయిన పూర్వీకుల నీడల్ని చూడడం వంటివి కనబడుతూ ఉంటాయి. కలలో కూడా పితృదేవతలు కనబడుతూ ఉంటారు. చనిపోయిన పూర్వికులు పిలుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికని తన కుటుంబ సభ్యులకి తెలియజేయడానికి అటువంటి చిహ్నాలు పొందుతారట. అలానే గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు ఒక రకమైన రహస్యమైన తలుపు కనపడుతుందట.

Advertisement

Advertisement

కొందరు తలుపునుండి కాంతి కిరణాలు బయటికి రావడానికి చూస్తారు. ఇంకొంతమంది ఆ తలుపు నుండి మంటలు రావడం చూస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే త్వరలో చనిపోతారని అర్థం చేసుకోవాలని, చివరి క్షణాల్లో ఒక వ్యక్తి తనతో పాటుగా యమదూతల్ని చూస్తారు. నిజానికి వారు ఆ వ్యక్తి ఆత్మని తమతో తీసుకెళ్లడానికి వస్తారు.

ఒక వ్యక్తి తను చుట్టూ యమదూతల ఉనికిని అనుభవించడం మొదలైనప్పుడు అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని దానికి అర్థం. చావు వచ్చినప్పుడు నీడ కూడా వెంటాడుతూ కనబడుతుందట. ఇది నిజమేనట. ఒక వ్యక్తికి చివరి గడియలు వచ్చినప్పుడు అతను నీటిలో, అద్దంలో, నెయ్యి నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేడు. చివర సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతంలో చేసిన చెడు పనులన్నీ కూడా గుర్తుకు వస్తాయి. చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనసులో పొందుపరుచుకున్న కోరికల్ని కుటుంబ సభ్యులతో చెప్పాలని అనుకుంటారట.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading