నటి మోహిని అంటే ప్రస్తుత తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా హీరోయిన్ మోహిని అంటే అందరూ టక్కున గుర్తుపడతారు. ఈ హీరోయిన్ ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. తెలుగులో బాలయ్య సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న మోహిని ఆ సినిమా అనంతరం చిరంజీవి, మోహన్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల్లో కలిపి దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఈవిడది బ్రాహ్మణ కుటుంబం. ప్రస్తుతం ఈవిడ క్రైస్తవ మతాభిమాని. అయితే తాజాగా మోహిని తన నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి తెలియజేశారు. తనకు ఎవరో చేతబడి చేశారని… తనను ఏసుప్రభువు కాపాడాడని చెప్పుకొచ్చింది. తనకు పెళ్లి అయిన ఐదు సంవత్సరాలకి అనేక మానసిక సమస్యలు వచ్చాయని, కొన్ని సందర్భాల్లో నేను ఏం చేసేదాన్నో నాకే తెలిసేది కాదు. కొన్ని సందర్భాల్లో ఆత్మ***హత్య ప్రయత్నాలు కూడా చేశానంటూ చెప్పుకొచ్చింది.
Advertisement
దీంతో ఓ ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించుకోగా ఆయన నాకు చేతబడి చేశారని చెప్పాడు. ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసిన తర్వాత ఏసుప్రభువును నమ్ముకున్నానని… ఆ తర్వాత మానసిక సమస్యల నుంచి బయటపడ్డానని చెప్పింది. చిన్నతనం నుంచి ఇంట్లో ఎన్నో పూజలు చేసేవాళ్ళమంటూ… అంతేకాకుండా గుళ్ళకు చాలా తిరిగేవాళ్ళం అని మోహిని చెప్పుకోచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!