Home » సమంత డైవర్స్ తీసుకున్నాక తాళిని ఏం చేసిందో తెలుసా..?

సమంత డైవర్స్ తీసుకున్నాక తాళిని ఏం చేసిందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన సమంత అక్కినేని వారి హీరో నాగార్జున తనయుడు నాగచైతన్యను ప్రేమించి కొన్నేళ్ల తర్వాత వివాహం ద్వారా ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన మొదటి మూవీ ఏం మాయ చేసావే. తొలి చూపులోనే ప్రేమలో పడ్డ వీరు, కొద్దిరోజులు ఎవరికీ తెలియకుండా రహస్య ప్రేమాయణం నడిపించారు. చివరికి ఇద్దరూ ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం ద్వారా ఒకటై పోయారు. కానీ సమంత ఇంట్లో మాత్రం నాగచైతన్యతో పెళ్లి అంటే ఒప్పుకోలేదట. కానీ సమంత పట్టుబట్టి నేను చేసుకుంటే అతన్నె చేసుకుంటా లేదంటే ఇక పెళ్లి వద్దు అన్నట్టుగా గట్టిగా మాట్లాడరట.

Advertisement

also read:“గాడ్ ఫాద‌ర్” వ‌ర‌కు చిరు కెరీర్ లో న‌టించిన 17 రిమేక్ సినిమాలు ఇవే….? ఏది హిట్ ఏది ఫ్లాప్..?

Advertisement

చివరికి ఫ్యామిలీ ఒప్పించి గోవా లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే.. చూడ ముచ్చటైన జంట, చాలా చక్కని జంట అని ఫ్యాన్స్ సంబరపడుతున్న వేళ వీరందరికీ షాకిచ్చారు.. మేము విడాకులు తీసుకొని విడి పోతున్నామని ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఎందుకు విడాకులు తీసుకుంటున్నారని కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే వీళ్ళ పెళ్లి సమయంలో సమంత ధరించిన నగలు, చీరలు చాలా ఫేమస్ గా మారాయి. ఇవన్నీ దగ్గుబాటి కుటుంబానికి చెందినవి అని వార్తలు వచ్చాయి.

ఇక సమంత మెడలో ఉన్న ఒక తాళిబొట్టు దగ్గుబాటి లక్ష్మీ వాళ్ళ అమ్మగారు ఇచ్చారట.. విడాకుల తర్వాత తన నగలు అన్నీ దగ్గుబాటి వారికి ఇచ్చేసి దాంతో పాటుగా ఒక తాళిబొట్టును కూడా అందులోనే ఇచ్చారట. మరో తాళిబొట్టు సమంత వారి కుటుంబ సభ్యులు ఇవ్వడంతో దాన్ని సమంత దగ్గర ఉంచుకుందని సమాచారం.. ఏది ఏమైనా ఈ బ్యూటిఫుల్ జంట విడిపోవడం అనేది ఫ్యాన్స్ ను ఇప్పటికీ ఆవేదనకు గురి చేస్తోంది.

also read:

Visitors Are Also Reading