Home » ప్రజాసేవలో పడి పిల్లల ప్రేమకి దూరం అయ్యాను. ..! రోజా కూతురు గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

ప్రజాసేవలో పడి పిల్లల ప్రేమకి దూరం అయ్యాను. ..! రోజా కూతురు గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకురాలు, సినిమా నటి రోజా సెల్వమణి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకుల్లో ఆమెకు చాలా మంది అభిమానులే ఉన్నారు.

minister-roja

Advertisement

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా.. బుల్లితెరపై పలు షోలలో కూడా ఆమె కనిపిస్తూ ఉంటారు. ఇటు ప్రజాసేవ, అటు బుల్లితెరపై తన పాత్రని పండించడంలో రోజా సమన్యాయం చేస్తూ ఉంటారు.

అయితే ఈ క్రమంలో ఆమె చాలా బిజీ గా ఉంటారు. ప్రజాసేవలో ఒక్కోసారి తన పిల్లల ప్రేమని కూడా మిస్ అవుతూ ఉంటాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తన పిల్లల గురించి మాట్లాడుతూ రోజా చాలా ఎమోషనల్ అయ్యారు. తన పిల్లలు కూడా తనని మిస్ అవుతూ ఉంటారని సెల్వమణి చెబుతారని చెప్పి కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అందుకే ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా.. అప్పుడప్పుడు వారిని ట్రిప్స్ కి తీసుకెళ్ళిపోతు ఉంటానని.. లేదా హైదరాబాద్ లో ఇంట్లో ఉన్నప్పుడు వారిని కూడా నా దగ్గరికే తెచ్చేసుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చారు.

Advertisement

ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత బిజీ గా ఉన్నా.. పర్సనల్ లైఫ్ లో నా ఫ్యామిలీ ని చూసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానని అంటారు. కోవిడ్ టైం లోనే ఎక్కువగా పిల్లలతో సమయం స్పెండ్ చేసానని రోజా చెప్పుకొచ్చారు. ఇక రోజా కూతురు కూడా సోషల్ సర్వీస్ చేయడంలో ముందుంటుంది. తన పుట్టిన రోజు సందర్భంగ ఓ ఆర్ఫన్ కు వెళ్లిన తాను ఓ ఐదుగురు పిల్లలకు సొంతంగా చదివించాలని నిర్ణయం తీసుకుందట. అలాగే.. ఇంటి వద్ద కూడా చుట్టూ ఎదో కంస్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటె.. అక్కడ ఉండే చిన్నపిల్లలను ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టడం, వారికి స్టేషనరీ కిట్స్ ఇచ్చి చదివించడం లాంటివి కూడా చేస్తుందట. సైలెంట్ గా ఓ బుక్ ని రాసి పబ్లిష్ చేసిందట. ఆ బుక్ పబ్లిష్ అయ్యే వరకు రోజాకు కూడా ఈ విషయం తెలియదట. ఇలా రోజా తన ఫ్యామిలీ గురించి పలు విషయాలను ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading