Home » బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తాడు…ర‌జ‌నీకాంత్ షాకింగ్ కామెంట్స్…!

బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తాడు…ర‌జ‌నీకాంత్ షాకింగ్ కామెంట్స్…!

by AJAY
Ad

అన్న‌గారు ఎన్టీరామారావు శ‌త‌జయంతి ఉత్స‌వాల‌కు అతిధిగా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హాజ‌ర‌య్యారు. ఈ సంధ‌ర్బంగా ర‌జినీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ర‌జినీకాంత్ స‌భ‌ లో మాట్లాడుతూ….ఇంత పెద్ద సభను చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనుంది…. కానీ, అనుభవం వద్దని ఆపుతుంద‌ని అన్నారు. ఇలాంటి పెద్ద వేడుకల్లో నేను తెలుగు మాట్లాడి చాలా రోజులు అవుతోంది అన్నారు.

Advertisement

ఏదైనా తప్పుగా మాట్లాడితే క్ష‌మించాలి అంటూ ర‌జినీ కోరారు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో జ్ఞానం చెబుతుందని ఎంత సేపు మాట్లాడాలనేది సభ చెబుతుందని అన్నారు. మీ అందరినీ ఇలా చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తుంది కానీ, ‘వద్దురా రజనీ’ అని అనుభవం ఆపుతుంది అంటూ రజినీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

అంతే కాకుండా బాల‌య్య‌ను ఉద్దేశించి మాట్లాడుతూ….బాలకృష్ణ నా మిత్రుడు, కంటిచూపుతోనే చంపేస్తాడు అంటూ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ చేసే ఫీట్లు అమీర్‌ఖాన్‌, సల్మాన్‌, అమితాబ్‌, నేను చేసినా జనం ఒప్పుకోరు అంటూ రజనీకాంత్ బాల‌య్య పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఇక ర‌జనీకాంత్ రావ‌డంతో స‌భ‌కు అభిమానులు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. స్టార్ హీరోలు ఒకేసారి క‌నిపించ‌డంతో స‌భ క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో ర‌జినీకాంత్ కు విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది. ఎన్టీఆర్ స్టార్ హీరోగా రానిస్తున్న స‌మ‌యంలో ర‌జినీ కూడా ఆయ‌న‌ను ఆద‌ర్శంగా తీసుకుని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యాడు.

ALSO READ :ప్ర‌భుదేవ రెండో భార్య హిమానిని ఎవ‌రో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే మ‌తిపోవాల్సిందే..!

Visitors Are Also Reading