Home » ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖ‌ర్చుపెట్టారా..? పూర్తి క్లారిటీ ఇచ్చిన దాన‌య్య‌..!

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖ‌ర్చుపెట్టారా..? పూర్తి క్లారిటీ ఇచ్చిన దాన‌య్య‌..!

by AJAY
Published: Last Updated on

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమాలోకి నాటునాటు పాట‌కు ఆస్కార్ రావ‌డంతో తెలుగు సినిమా స్థాయి ఉన్న‌త‌శిఖ‌రాల‌కు తాకింది. అయితే ఈ సినిమా ద‌ర్శ‌కుడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌రియు హీరోలు ఆస్కార్ వేడుకల్లో సంద‌డి చేశారు. కానీ కోట్లు ఖర్చుపెట్టి ఈ సినిమాను నిర్మించిన నిర్మాత దాన‌య్య మాత్ర ఆస్కార వేడుక‌లో క‌నిపించ‌లేదు.

కాగా తాజాగా దాన‌య్య ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేశాడు. త్రిబుల్ ఆర్ సినిమా నిర్మాత ఎవ‌రు అంటే వ‌చ్చే పేరు దాన‌య్యే క‌దా అది చాలని అన్నారు. నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డు రావ‌డం గ‌ర్వంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆస్కార్ వేడుక‌కు త‌న‌ను రాజ‌మౌళి దూరం పెట్టారు అనే వార్త‌ల‌లో నిజం లేద‌ని చెప్పారు.

రాజ‌మౌళి అలాంటి వ్య‌క్తి కాద‌ని చెప్పారు. రాజ‌మౌళి చాలా మంచివార‌ని అన్నారు. సినిమా నిర్మాత‌ల‌కు చాలా గౌర‌వం ఇస్తార‌ని చెప్పారు. అంతే కాకుండా తాను చాలా సింపుల్ గా ఉండేవ్య‌క్తిన‌ని వేడుక‌ల‌కు వెళ్లే ఇష్టం ఉండ‌ద‌ని అందుకే వెళ్ల‌లేద‌ని చెప్పారు.

నాకు ఆర్భాటాలు న‌చ్చ‌వ‌ని అందుకే అవార్డు ఫంక్ష‌న్ కు దూరంగా ఉన్నాన‌ని అన్నారు. సినిమాతో మంచి పేరు వ‌చ్చింది అది చాలు అంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా రూ.80కోట్ల ఖ‌ర్చు పై కూడా దాన‌య్య మాట్లాడారు. తాను డ‌బ్బు పెట్ట‌లేద‌ని త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. రాజ‌మౌళి పెట్టారో ఏమోగానీ తెలియ‌ద‌ని అయినా సినిమాకే అంతడ‌బ్బు రాద‌ని అన్నారు.

Visitors Are Also Reading