చిత్ర పరిశ్రమలో వరుస విడాకుల వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే చాలామంది తమ విడాకులను ప్రకటించారు. గతేడాదికాలంగా విడాకుల వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువైపోయాయి. భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాల వల్ల పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా విడిపోతూ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తున్నారు.
రీసెంట్ గా సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే కోలీవుడ్ హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులను ప్రకటించారు. ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ ప్రియమణి తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియమణి 2017 లో ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ముస్తఫా రాజ్ కు పెళ్లై విడాకులు కూడా అయ్యాయి.
Advertisement
Advertisement
ఆ సమయంలో ముస్తఫా రాజ్ భార్య ప్రియమణి పై ఆరోపణలు సైతం చేసింది. ఇదిలా ఉంటే ముస్తఫా రాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియమణితో సైతం గొడవలు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో కొంతకాలంగా వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నట్టు సమాచారం. అయితే విడాకుల వార్తలను మాత్రం ప్రియమణి టీం ఖండిస్తోంది. అంతేకాకుండా రెండు నెలల క్రితం జరిగిన రాకెట్రీ సక్సెస్ పార్టీలో వీరిద్దరూ పాల్గొన్నారు అని గుర్తు చేస్తోంది.
అయినప్పటికీ ప్రియమణి విడాకుల వార్తలకు చెక్ పడటం లేదు. ఈ వార్తలకు చెక్ పడాలంటే ప్రియమణి స్పందించాల్సిందే. ఇదిలా ఉంటే ప్రియమణి ఒకప్పుడు టాలీవుడ్ లోని స్టార్స్ అందరికీ తోనూ జోడి కట్టింది. ప్రస్తుతం సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలో నటిస్తూనే టీవీ షోలలో సందడి చేస్తోంది. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ లో నటించి ప్రియమణి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అదేవిధంగా రానా హీరోగా నటించిన విరాటపర్వంలో ముఖ్యమైన పాత్రలో నటించి తన నటనతో మెప్పించింది.