హైదరాబాద్ జూలో జంతులను దత్తత తీసుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. దత్తత అంటే వాటిని ఇవ్వరు కానీ వాటి బాగోగుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ జంతువుకు తామే నామకరణం చేసి వారి పేరును కూడా జంతువురు వివారాల బోర్డుపై ముద్రిస్తారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ కు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పేరును పెట్టారు.
Advertisement
ఈ పులిని రచనా చౌదరి అనే మహిళ దత్తత తీసుకున్నారు. కాగా ఆమె కోరిక మేరకు పులి పేరును ప్రభాస్ అని మార్చారు. పులి వివరాలను తెలిపే బోర్డు పై రాయల్ బెంగాల్ టైగర్ అనే పేరు రాసి దానిపక్కన బ్రాకెట్ లో ప్రభాస్ పేరును రాశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు. ప్రభాస్ రేంజ్ అంటే అలా ఉంటుందని అంటున్నారు.
Advertisement
మరి కొందరు మా హీరో పులి అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. బాహుబలి తరవాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. బాలీవుడ్ మేకర్స్ కూడా ప్రభాస్ తో సినిమాలు చేయాలని వెంటపడుతున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కాగా ఫ్యాన్స్ ను నిరాశపర్చింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ అనే సినిమాలలో నటిస్తున్నారు.