Home » ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్.. కార‌ణం ఏమిటంటే..?

ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్.. కార‌ణం ఏమిటంటే..?

by Sravan Sunku
Published: Last Updated on
Ad

కరోనా లాక్‌డౌన్ త‌రువాత మాత్రం సినిమాల్లో జోరు పెంచాడు ప్రభాస్. ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, నాగ్ అశ్విన్ సినిమా, ‘స్పిరిట్’ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సినిమా విడుద‌ల స‌మ‌యం దగ్గర పడుతున్నా.. చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీనిపై అసంతృప్తికి గురైన ఓ ప్రభాస్ ఫ్యాన్ తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు లేఖ రాశాడు. ఇప్పుడు లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ఇన్ని చిత్రాల్లో నటిస్తున్నా ఆయన నటించే చిత్రాల నుంచి టైమ్ టూ టైమ్ అప్‌డేట్ రావడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కించిన యూవీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఆ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించినా.. ఇప్పటికీ ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం పట్ల ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ‘రాధేశ్యామ్’ చిత్ర యూనిట్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Advertisement

 

నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు – రెబెల్ స్టార్ ఫ్యాన్” అంటూ అభిమాని విన్నవించుకొన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాధేశ్యామ్ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా ‘రాధేశ్యామ్’ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ అంటూ అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ నోట్‌ లో ఓ అభిమానిగా తన ఆవేదనను వివ‌రించాడు.

Visitors Are Also Reading