Home » జనసేనాని భార్య చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

జనసేనాని భార్య చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

by Sravanthi
Ad

పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయాన్ని సాధించి తర్వాత తన కుటుంబ ఆశీస్సులు అందుకోవడానికి వచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్, కొణిదెల సురేఖ, అంజనాదేవి ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ సాధించిన విజయాన్ని అందరూ ఆస్వాదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ ని చూసి పొంగిపోయారు. చిరంజీవి ఇంటికి తన భార్య అన్నా కొడుకు అకీరాతో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. మెగా నివాసంలో జరిగిన సంబరాల్లో పవన్ కళ్యాణ్ సతీమణి చేసిన ఓ పని అందరిని ఆకట్టుకుంటోంది.

Advertisement

తన భర్త మీద ప్రేమ భక్తుని ఆమె చాటుకుంది. జగన్ తో పాటుగా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని నీచంగా అవమానిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో వారి లోపాలను ఎత్తిచూపితే నాలుగు పెళ్లిళ్లు అని పవన్ కళ్యాణ్ పై జగన్ చవకబారు విమర్శలు చేశారు నాలుగు భార్యలు అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు తన భార్య అన్నాలిజనోవా ని వెంట పెట్టుకుని ఓటు వేసి విమర్శలకు సమాధానం చెప్పారు. ఫలితాలు వచ్చాక భార్య కొడుకుతో కలిసి ఆయన అనేక సందర్భాల్లో కనపడ్డారు.

Advertisement

Also read:

అంతేకాకుండా ప్రధానిని ఢిల్లీలో కలిసిన సమయంలో కూడా కుటుంబ సభ్యుల్ని మోదీకి పరిచయం చేసారు ఇలాంటి సంఘటనలతో వైసిపి నాయకుల అసత్య ప్రచారాలను మౌనంగా తిప్పి కొట్టారు. భార్య తో పాటుగా చిరంజీవి నివాసానికి పవన్ వచ్చారు. పవన్ ఫ్యామిలీకి మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అన్నా తన భర్త పై ఉన్న ప్రేమను భక్తిని చాటుకున్నారు. ఎలా అంటే ఆయన వెళ్తుంటే ఆయన చెప్పులని ఆమె మోసారు. పవన్ మీదున్న ప్రేమాభిమానాలకు ఇది సాక్ష్యంగా నిలిచింది ఇది చాలు కదా వ్యతిరేకించే వారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమాధానం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading