Home » తాడేపల్లిగూడెం జెండా సభలో.. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్…!

తాడేపల్లిగూడెం జెండా సభలో.. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్…!

by Sravya
Ad

తాడేపల్లిగూడెం జెండా సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇక వివరాల్లోకి వెళితే.. వచ్చే ఎన్నికలకు సిద్ధమంటున్న జగన్ కి యుద్ధం ఇద్దామని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. జగన్ పాలనలో అందరూ మోసపోయారని అన్నారు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదని వైసిపి నాయకులకి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము మోసే జండా స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు జగన్ ఐదేళ్ల పాలన లో ఒక్క రోజైనా బాగుపడిందా అని అడిగారు పవన్ కళ్యాణ్. క్లాస్ వార్ కాస్ట్ వార్ అంటున్న జగన్ ఐదు కోట్ల మంది ప్రజల్ని ఐదుగురు దగ్గర తాకట్టు పెట్టారని అన్నారు. సొంత బాబాయిని చంపించారని అన్నారు సొంత చెల్లిని గోడకేసి కొట్టాడు. వీళ్ళు నాకు సలహాలు ఇచ్చేదా అని మండిపడ్డారు పవన్ కళ్యాణ్.

Advertisement

Advertisement

అన్ని స్థానాలలో పోటీ చేయడానికి మన దగ్గర వేల కోట్లు ఉన్నాయా అని అన్నారు. టీడీపీలా బలమైన సంస్థ గత వ్యవస్థ ఉందా అని అడిగారు ఇప్పుడిప్పుడే జనసేన ఇల్లు కట్టుకుందాం కడుతున్నాం కోట కూడా కడతాం అని అన్నారు. పవన్ కళ్యాణ్ తాడేపల్లి కోట కూడా కూలగొడతామని అన్నారు. అలానే ప్రజలకి పాతికేళ్లు భవిష్యత్తు ఇవ్వాలని అన్నారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం మన చంద్రబాబుని జైల్లో పెట్టడం తనని బాధించిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

Cm Jagan

ఆయన భార్యను కూడా అనరాని మాటలు అంటే బాధ కలిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు తన కూతురు చనిపోయిందని సుగాలి ప్రీతి తల్లి చెప్తే రెండు చోట్ల ఓడి కూర్చున్న నాకు నిస్సహాయతగా అనిపించిందని అందరూ కష్టాలు చెప్తుంటే చలించానని పవన్ కళ్యాణ్ అన్నారు. వీళ్ళ కోసం నేను నిలబడకపోతే రేపు నా కోసం ఎవరు నిలబడరు అన్నారు అందుకే పొత్తుకి ప్రతిపాదించా అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోతున్న 45 రోజుల్లో వైసిపి గుండాలు క్రిమినల్స్ టిడిపి జనసేన నేతలు కార్యకర్తలు వీర మహిళల మీద దాడులకు పాల్పడితే మక్కిలి విరగకొట్టి మడత మంచంలో పడుకోబెడతామని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading