Home » వివాహమైన మహిళలు ఆ దిక్కున అస్సలు పడుకోకూడదట..!

వివాహమైన మహిళలు ఆ దిక్కున అస్సలు పడుకోకూడదట..!

by Azhar
Ad

ఇండియాలో వాస్తు శాస్త్రాన్ని చాలామంది ప్రజలు నమ్ముతుంటారు. ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ప్రతి ఒక్కరు ఈ శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని వాస్తు శాస్త్రం ప్రకారం ఏది ఎటువైపు ఉంటే మంచిది అని ఆలోచించుకుని ఇంటిని నిర్మిస్తారు. అలా చేస్తే ఆ ఇంట్లో సంతోషం, సుఖం ఉంటాయని ప్రజలు నమ్ముతారు, కానీ వాస్తు శాస్త్రం అనేది కేవలం వస్తువులకు మాత్రమే కాదు… మనుషులకు కూడా ఉంటుంది. వివాహం చేసుకున్న స్త్రీలు ఈ వాస్తు శాస్త్రం ప్రకారం ఎలా ఉండాలి.. వివాహం చేసుకొని వారు ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం.

Advertisement

Advertisement

వాస్తు శాస్త్రం ప్రకారం వివాహం చేసుకున్న స్త్రీలు వాయువ్య దిశగా అస్సలు నిద్రించకూడదు. ఒక వేళ ఇలా చేస్తే వారి వివాహ జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం… ఇంట్లో దారిద్యం ఎక్కువ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. అలాగే వివాహం కానీ అమ్మాయిలు వాయువ్యం దిశగానే నిద్రించాలి. అలా చేస్తే వారికి పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి.

ఇక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎక్కువగా ఉత్తరం వైపుగా కూర్చోవడం మంచిది. అలాగే వారి పుస్తకాలను పశ్చిమం లేదా దక్షిణ దిశలో ఉంచడం వారికి సహాయ పడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వాయువ్య దిశ అనేది ఒక ఇంటికి చాలా మంచిది. కానీ ఆ దిశలో ఏదైనా దోషం ఉంటె… ఇంట్లో ఆ దిశగా అక్కడ నీటికి సంబంధించిన ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అంటే చేపలు పెంచే అక్వేరియం లేదా ఫౌంటెన్ వంటివి.

Visitors Are Also Reading