తమిళ నటుడు మన్సూర్ అలీ టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి మరియు హీరోయిన్ త్రిష , ఖుష్బూలపై తమిళ నాడు హైకోర్టులో పరువు నష్టం దావా వేశాడు. కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మన్సూర్ అలీ ఖాన్ వీడియో మొత్తం చూడకుండా తన పరువు కి భంగం కలిగి0చారని ఆరోపించారు. ఈ కేసు రేపు సాయంత్రం మద్రాస్ హైకోర్టు జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
నటి త్రిష పై గతంలో మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను లియోడైరెక్టర్ లోకేష్ కనకరాజు చిరంజీవి త్రిష మరియు మాలవిక మోహన్ , పొలిటిషియన్స్ ఇతర నటీనటులతో పాటు తమిళ నటుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఖండించాయి. దీనిపై తమిళ నటి ,మహిళా మరియు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయినటువంటి కుష్బూ తమిళనాడు డిజీపీకి ఫిర్యాదు చేసింది. అలాగే అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిజిపి కి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Advertisement
దీనితో చెన్నై ది థౌసండ్ లైట్ పోలీసులు మనసుర్ అలీ ఖాన్ పైన రెండు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఫిర్యాదు దాఖలైన సమయంలో మనసురు అలీ ఖాన్ చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు. అయితే తన బెయిల్ కోర్టు తిరస్కరించింది. అయితే మరోవైపు అతడు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో త్రిషకు క్షమాపణలు చెప్పాడు. తన క్షమాపణలను త్రిష కూడా అంగీకరించింది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!