Home » మీ ఆశీస్సుల‌తోనే మౌనిక‌తో పెళ్లి…మొద‌టిసారి స్పందించిన మ‌నోజ్..!

మీ ఆశీస్సుల‌తోనే మౌనిక‌తో పెళ్లి…మొద‌టిసారి స్పందించిన మ‌నోజ్..!

by AJAY
Ad

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌నోజ్ మౌనికా రెడ్డి దంప‌తులు మార్చి3వ తేదీన కుటుంబ స‌భ్యులు మ‌రియు బంధువుల మ‌ధ్య ఏడ‌డుగులు న‌డిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక పెళ్లి త‌ర‌వాత మ‌నోజ్ మౌనిక‌లు మొద‌టిసారి క‌ర్నూల్ కు వెళ్లారు.

Advertisement

పెళ్లి త‌ర‌వాత మంచు ల‌క్ష్మి ఇంటి నుండి భారీ కాన్వాయ్ తో మ‌నోజ్ మౌనిక‌తో క‌లిసి అత్త‌వారింటింకి వెళ్లాడు. కాగా పుల్లూరు టోల్ ప్లాజా వ‌ద్ద అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చి నూత‌న దంప‌తుల‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. దంప‌తులు ఇద్ద‌రూ శోభా నాగిరెడ్డి తండ్రి అయిన ఎస్వి సుబ్బారెడ్డి వ‌ద్ద ఆశీస్సులు తీసుకున్నారు.

ALSO READ :భర్తలు పొరపాటున ఈ విషయాలు…భార్యకు చెప్పారో మీ బంధం తెగిపోయినట్లే!

Advertisement

ఆ త‌ర‌వాత మ‌నోజ్ మీడియాతో మాట్లాడారు. పెళ్లి త‌ర‌వాత మ‌నోజ్ మీడియా ముందు మాట్లాడ‌టం ఇదే మొద‌టిసారి. మ‌నోజ్ మీడియాతో మాట్లాడుతూ…మీ అంద‌రి ఆశీస్సులతోనే మౌనిక‌తో పెళ్ల‌య్యింది.

క‌ర్నూల్ నుండి ఆళ్ల‌గ‌డ్డ క‌డ‌ప ఆ త‌ర‌వాత తిరుప‌తికి వెళుతున్నాం…మీ అంద‌రి ఆశీస్సులు మ‌రియు స‌పోర్ట్ ఉంటుంద‌ని న‌మ్ముతున్నాను. అంటూ మ‌నోజ్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం మ‌నోజ్ మౌనిక ల ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అభిమానుల‌ను నూత‌న దంప‌తులకు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

ALSO READ :వివాహితులకు ఒడిబియ్యం పోయడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా ?

Visitors Are Also Reading