Home » అతడు సినిమాలో ఆ సీన్లు.. త్రివిక్రమ్ కాపీ కొట్టారని మీకు తెలుసా?

అతడు సినిమాలో ఆ సీన్లు.. త్రివిక్రమ్ కాపీ కొట్టారని మీకు తెలుసా?

by Bunty
Ad

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీ అతడు. ఈ సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు.

Advertisement

అయితే ఈ చిత్రాన్ని జయభేరి అనే నిర్మాణ సంస్థ ద్వారా మురళీమోహన్ నిర్మించారు. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు కంటే ముందు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకొని ఆయన కథ చెప్పడానికి వెళ్తే పవన్ ఈ కథ వింటూ నిద్రపోయారని విషయం త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇది ఇలా ఉండగా, త్రివిక్రమ్ చేసిన ప్రతి సినిమా మీద కూడా ఏదో ఒక సీన్ కానీ స్టోరీ కానీ కాపీ చేశారు అనే మాట అయితే బలంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే అతడు సినిమా మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అవేంటంటే అతడు సినిమాలో మహేష్ బాబు సునీల్ ఇద్దరూ నైట్ టైం పంతులు ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో చెట్ల దగ్గర డబ్బులు వేసే సీన్ అక్కడ సునీల్ చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా కాపీనేనట. ప్రముఖ నవల రచయిత అయిన మధుబాబు రాసిన యముడు అనే బుక్ లో ఇలాంటి సీన్ ఉంటుంది.

Advertisement

కాకపోతే అక్కడ రాముడు లక్ష్మణుడు ఇంటికి వచ్చారు అని చెప్తాడు. ఇక్కడ సీతలేని రాముడు, తోకలేని హనుమంతుడు వచ్చాడు అనే డైలాగ్ చెప్తాడు. కొంచెం సీన్ లోనే డైలాగ్స్ మార్చి ఈ సినిమాలో పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఇంకో సీన్ కూడా తీసుకున్నారు. అది ఏంటంటే, హీరో చిన్నప్పుడు వేరే ఫ్రెండ్ తో అర్ధరాత్రి స్మశానంలోకి వెళ్ళాలి, అని పందెం కాసే సీన్ కూడా మధుబాబు గారి బుక్ లో నుంచి తీసుకుంది. కానీ త్రివిక్రమ్ దీని ఒక్కదానికి మాత్రం మధుబాబు గారి పర్మిషన్ తీసుకున్నట్టుగా అప్పట్లో మధుబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

READ ALSO : నటి సత్య కూతురిని చూశారా? అచ్చం హీరోయిన్‌లా ఉందిగా ..!

Visitors Are Also Reading