టాలీవుడ్ లోకి ఎక్కువ మంది హీరోలు అడుగుపెట్టింది మెగాఫ్యామిలీ నుండే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చిరంజీవి నటవారసులుగా ఆయన కుమారుడితో పాటూ ఆయన సోదరి కుమారులు మరియు ఆయన సోదరుడి కుమారులు సైతం హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక దర్శకులు కూడా మెగా ఫోన్ అందుకుంటే అది అదృష్టంగా భావిస్తారు. కానీ మెగాఫోన్ అందుకున్నప్పటికీ శ్రీనువైట్ల ఆ హీరోలతో హిట్ కొట్టలేకపోయాడు.
Advertisement
శ్రీనువైట్ల మెగాఫ్యామిలీ హీరోలతో మూడు సినిమాలు చేస్తే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. శ్రీనువైట్ల చిరంజీవి హీరోగా అందరివాడు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కానీ ఈ సినిమా హిట్ అవ్వలేదు. అంతే కాకుండా శ్రీనువైట్ల రామ్ చరణ్ కాంబినేషన్ లో బ్రూష్లీ సినిమా తెరకెక్కింది.
Advertisement
ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయ్యింది. ఇక శ్రీనువైట్ల మెగాహీరో వరుణ్ తేజ్ తో మిస్టర్ అనే సినిమాను తెరకెక్కించాడు. కాగా ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలా శ్రీనువైట్ల మెగా హీరోలకు ఫ్లాప్ లు ఇస్తే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం మెగా హీరోలతో సినిమాలు చేసి హిట్ లు ఇచ్చాడు.
హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్ తో హరీష్ శంకర్ సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా మంచివిజయం సాధించింది. అదే విధంగా వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.
ALSO READ :Jio దెబ్బకు దిగివచ్చిన స్టార్…ఇక ఫ్రీగా IPL 2023.. ఎలాగంటే !