Home » రియల్ లైఫ్ శ్యామ్ సిగారాయ్ స్టోరీ…మళ్లీ పుట్టానని చెబుతున్న 4 ఏళ్ల బాలిక…!

రియల్ లైఫ్ శ్యామ్ సిగారాయ్ స్టోరీ…మళ్లీ పుట్టానని చెబుతున్న 4 ఏళ్ల బాలిక…!

by AJAY
Ad

పునర్ జన్మల కాన్సెప్ట్ తో రీసెంట్ గా విడుదలైన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో శ్యామ్ సింగ‌రాయ్ చనిపోయి మళ్లీ పుడతాడన్న‌ సంగతి తెలిసిందే. అయితే ఇది సినిమా కథ గాని ఇప్పుడు నిజంగానే ఓ బాలిక తాను చ‌నిపోయి మ‌ళ్లీ పుట్టాన‌ని చెబుతోంది. ఈ విష‌యాన్ని 4 ఏళ్ల బాలిక చెబుతోంది. అంతే కాకుండా తన కుటుంబాన్ని కలవాలని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఆసక్తికర ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో చోటుచేసుకుంది.

udaypur kinjal

udaypur kinjal

పరవాడ గ్రామానికి చెందిన రతన్ సింగ్ అనే వ్యక్తికి ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. వారిలో నాలుగేళ్ల కూతురు కింజ‌ల్ గత ఏడాది నుండి పూర్వ జన్మ గురించి మాట్లాడుతోంది. కింజ‌ల్ తనపేరు ఉషా అని పిప్లాంతీ అనే గ్రామం అని చెబుతోంది. 2013లో అగ్నిప్రమాదంలో తాను చనిపోయాన‌ని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే మొదట్లో ఈ మాటలను ఎవరూ పట్టించుకోలేదు. గ్రామంలో బాలిక ఉంటున్న గ్రామానికి 30కిలోమీటర్ల దూరంలోనే చ‌నిపోయిన ఉషా వాళ్ల గ్రామం ఉంది.

Advertisement

Advertisement

udaypur kinjal

దాంతో ఈ మాటలు ఉషా కుటుంబ సభ్యులకు చేరాయి. దాంతో వెంటనే ఆ బాలికను ఉషా సోద‌రుడు పంకజ్ వెళ్లి కలుసుకున్నాడు. పంకజ్ ను చూసిన వెంటనే కింజ‌ల్ ఎంతో సంతోషపడింది. గుర్తు పట్టడమే కాకుండా చిన్ననాటి సంఘటనలు ఒక్కొక్కటిగా చెప్పేసింది. దాంతో పంక‌జ్ షాకయ్యాడు. కింజ‌ల్ ను జనవరి 14న తన గ్రామానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఉషా తల్లి దుర్గాదేవిని చూసిన కింజ‌ల్ బోరున ఏడ్చేసింది. గ్రామంలో గత జన్మలో తనకు ఇష్టమైనవాటి గురించి చెప్పింది. ఇక ఉషా సోదరుడు పంకజ్ మరియు ఆమె తల్లి కింజ‌ల్ అచ్చం తమ‌ కూతురు లాగా మాట్లాడుతుందని అన్ని విషయాలు ఖచ్చితంగా చెబుతుందని అంటున్నారు. కింజ‌ల్ తల్లిదండ్రులతో వాళ్లు పరిచయం పెంచుకుని త‌ర‌చూ ఆ బాలిక‌తో ఫోన్ మాట్లాడుతున్నారు.

Visitors Are Also Reading