Home » సుమారు 1000 కోట్లు విలువ చేసే ఆ స్థలాన్ని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ కి కాకుండా నరేష్ కి ఇచ్చారా ?

సుమారు 1000 కోట్లు విలువ చేసే ఆ స్థలాన్ని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ కి కాకుండా నరేష్ కి ఇచ్చారా ?

by Sravanthi
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మహేష్ బాబు ఎప్పటి నుండో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సుదీర్ఘ సినిమా ప్రస్థానంలో కృష్ణ అనేక ఒడిదుడుకొని ఎదుర్కొన్నారు. నటుడిగా నిర్మాతగా ఎంతో కష్టపడి కోట్ల రూపాయల అస్తిని సంపాదించుకున్నారు. కృష్ణ తన ఆస్తి ఎవరికిచ్చారు కన్నకొడుకులు రమేష్, నరేష్, మహేష్ లో ఎవరికీ ఇచ్చారు అనే సందేహం చాలా మందిలో ఉంది.

Advertisement

తాజాగా ఈ విషయం గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రయోగాత్మక సినిమాలని నిర్మించడానికి నిర్మాతలు భయపడేవారు కానీ కృష్ణ నిర్మాణ బాధ్యతలు తీసుకుని సంపాదించిన రూపాయి సినిమాల్లోనే పెట్టేవారు. పద్మాలయ స్టూడియోస్ నిర్మించి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన కళామ్మ తల్లికి సేవలు చేశారు 1961 లో అయిన సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు 2016 లో విడుదలైన శ్రీశ్రీ ఆయన ఆఖరి సినిమా.

Also read:

Advertisement

ఏకంగా వెయ్యి కోట్లకు పైగా విలువైన ఆస్తి నరేష్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. 12 ఎకరాల స్థలం నరేష్ పేరు మీద ఉందట. నానక్ రామ్ గూడ అడవిలా ఉన్నప్పుడు కృష్ణ విజయనిర్మల 12 ఎకరాలు కొన్నారు. అప్పట్లో ఎకరం ఖరీదు 1.3 లక్షలు. ప్రస్తుతం మార్కెట్ ధర ఎకరం 100 కోట్లు. ఇంకా తక్కువ అంచనా వేసినా 12 ఎకరాలు 1000 కోట్లకు తగ్గదు. ఈ స్థలం కొన్న వెంటనే విజయనిర్మల కృష్ణ ఇక్కడికి వచ్చేసారు హౌస్ నిర్మించుకుని ఆ ఫామ్ హౌస్ లోనే జీవించినంత కాలం ఉన్నారు. నరేష్ ముందు నుండి కృష్ణ విజయనిర్మలతోనే ఉన్నారు నాలుగు ఎకరాలు ఉంచి మిగతాది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి ఇచ్చేశారు కృష్ణ మిగతా ఆస్తులు మహేష్ రమేష్ లకి ఇచ్చారు ఈ స్థలం మాత్రం నరేష్ కి ఇచ్చేశారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading