Home » ఆ ఒక్క త‌ప్పు చేసి ఉంటే చిరంజీవి.. సురేఖ‌కు భ‌ర్త అయ్యేవాడు కాదంట‌..!

ఆ ఒక్క త‌ప్పు చేసి ఉంటే చిరంజీవి.. సురేఖ‌కు భ‌ర్త అయ్యేవాడు కాదంట‌..!

by Bunty
Ad

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఓ చరిత్ర ఉంది. తరతరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఈ ఫ్యామిలీ. అదేవిధంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీది విడదీయరాని బంధం అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దివంగత దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య వేసిన పూల బాటలో ఇప్పుడు మెగా అల్లు కుటుంబం ప్రయాణిస్తుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉండగా, తక్కువ సమయంలోనే నటన, డ్యాన్స్ తో పాపులారిటీని సంపాదించుకుని మెగాస్టార్ చిరంజీవి సత్తా చాటారు.

READ ALSO : Sachin To Kohli : 2022లో అత్యంత ధనికమైన 10 మంది ఇండియన్ క్రికెటర్లు

Advertisement

అల్లు రామలింగయ్య, చిరంజీవి ప్రతిభను గుర్తించి సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేశారు. 1980 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 20వ తేదీన చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. చిరు హీరోగా ఎదుగుతున్న తీరు, ఆయన క్రమశిక్షణ చూసి అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను ఇచ్చి వివాహం చేశారు. అయితే చిరు తప్పు చేసి ఉంటే అసలు అల్లు వారి ఫ్యామిలీకి అల్లుడు అయ్యుండేవాడు కాదట. చిరంజీవిని తన అల్లుడిగా చేసుకునే ముందు అల్లు రామలింగయ్య చాలా ఎంక్వైరీలు చేశాడట.

Advertisement

ఇక చిరంజీవి, అల్లు రామలింగయ్య ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి చెన్నైకి ట్రైన్ లో ప్రయాణించారట. ఆ రోజున అల్లు రామలింగయ్య వైన్ గ్లాస్ తీసుకుని చిరంజీవిని తాగమని చెప్పగా, ఆయన తనకు అలవాటు లేదని చెప్పారట. దాంతో అల్లు రామలింగయ్య అప్పుడే చిరు తన అల్లుడు అని ఫిక్స్ అయ్యారట. ఒకవేళ చిరు, అల్లు రామలింగయ్య ఆఫర్ చేసిన వైన్ తాగి ఉంటే రామలింగయ్య మరో నిర్ణయం తీసుకుని ఉండేవారేమో అని కొందరు భావిస్తున్నారు. కాగా, చిరు నటించిన వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

READ ALSO : నాగార్జునకు షాక్ …లీగల్ నోటీసులు పంపించిన సర్పంచ్…!

Visitors Are Also Reading