Home » భీమ్లా నాయ‌క్ ను మిస్ చేసుకున్న ముగ్గురు స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..!

భీమ్లా నాయ‌క్ ను మిస్ చేసుకున్న ముగ్గురు స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రానా కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు.

Advertisement

సినిమాలో నిత్యా మీన‌న్ సంయుక్త మీన‌న్ లు హీరోయిన్ ల‌గా న‌టించారు. అంతే కాకుండా ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటూ మాట‌లు రాశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియం కు రీమేక్ గా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ సినిమా క‌థ టాలీవుడ్ లో ప‌లువురు హీరోల వ‌ద్ద‌కు వెళ్లి చవ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు చేరింద‌ట‌. అంతే కాకుండా ఈ క‌థ ప‌వ‌న్ క‌ల్యాణ్ బాగా సూట్ అవుతుంద‌ని త్రివిక్ర‌మ్ ఒప్పించారట‌. ఇక ఈ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సినిమా క‌థ బాల‌కృష్ణ వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌.

Advertisement

raviteja

కానీ బాల‌య్య ఈ సినిమా క‌థ త‌న‌కు సూట్ అవ్వ‌ద‌ని నో చెప్పారట‌. అంతే కాకుండా వ‌రుస‌గా మ‌ల‌యాళ రీమేక్ లు చేస్తూ హిట్స్ అందుకుంటున్న‌ విక్టరీ వెంక‌టేష్ వ‌ద్ద‌కు కూడా ఈ సినిమా స్టోరీ వెళ్లింద‌ట‌. కానీ వెంక‌టేష్ కూడా ఈ సినిమా చేసేందుకు నో చెప్పార‌ట‌. అదే విధంగా మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ వద్ద‌కు కూడా ఈ సినిమా స్టోరీ వెళ్లింద‌ట‌.

VENKATESH

కానీ బిజీ షెడ్యూల్ వ‌ల్ల ర‌వితేజ కూడా ఈ సినిమాకు నో చెప్పారు. ఇదిలా ఉంటే చివ‌రగా ఈ క‌థ న‌చ్చ‌డంతో త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అప్రోచ్ అయ్యారు. క‌థ న‌చ్చ‌డంతో ప‌వ‌న్ కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తోంది. విడుద‌లైన మూడు రోజుల‌కే ఈ సినిమా వంద కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఇప్పటికీ ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది.

Visitors Are Also Reading