Home » పెళ్లిమండ‌పంలో మంట‌లు…. త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా భోజ‌నం చేస్తున్న అతిథులు !

పెళ్లిమండ‌పంలో మంట‌లు…. త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా భోజ‌నం చేస్తున్న అతిథులు !

by Azhar
Ad

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భివాండిలోని అన్సారీ మ్యారేజ్ హాల్‌లో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అరడజను ఫైరింజ‌న్స్ వ‌చ్చి సుమారు 3 గంటల పాటు శ్ర‌మించి మంట‌ల‌ను ఆర్పారు. ఈ మంట‌ల కార‌ణంగా 5 బైక్ లు, 1 కార్ ధ్వంసమ‌య్యాయి. ఫంక్ష‌న్ హాల్ లో వంట‌ల కార‌ణంగా ఈ మంట‌లు చెల‌రేగిన‌ట్టు తేలింది.

Advertisement

అయితే ఒక‌వైపు మంట‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డుతుంటే…మ‌రోవైపు పెళ్లికి వ‌చ్చిన కొంత‌మంది అతిథులు త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా తాపీగా భోంచేస్తూ కూర్చున్నారు. ఎగిసిప‌డుతున్న మంట‌ల‌ను గ‌మినిస్తూనే ఫుడ్ ను టేస్ట్ చేస్తూ క‌నిపించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూడండి!

Advertisement

Watch Video : 

 

Visitors Are Also Reading