Home » తారకరత్న మరణించాక భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారంటే..?

తారకరత్న మరణించాక భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారంటే..?

by Mounika
Ad

నందమూరి నట వారసుడిగా ఒకటో నెంబర్ కుర్రోడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు తారకరత్న. తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచారు. కానీ ఆ చిత్రాలేవీ కూడా తారకరత్నను హీరోగా సక్సెస్ చేయలేకపోయాయి. కానీ అమరావతి చిత్రంలో విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తారకరత్న. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రేంజ్ లో కాకపోయినా నటుడుగా ప్రేక్షకుల్లో మంచి మార్కులు దక్కించుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన తారతరత్న అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో హాస్పిటల్‌లో చేరారు. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

tarakarathna-life23 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18నా మహా శివరాత్రి రోజు శివసానిథ్యం చేరారు. ఈరోజుకి కచ్చితంగా తారకరత్న మరణించి ఆరు నెలలు గడిచింది. తారకరత్న మరణించి ఆరు నెలల గడుస్తున్నా కూడా ఆయన జ్ఞాపకాల నుండి ఇప్పటి బయటకు రాలేకపోతున్నారు అలేఖ్య రెడ్డి. ప్రతిరోజూ తారకరత్నను తలచుకుంటూ ఆమె మానసిక వేదన అనుభవిస్తున్నారు అనేది ఆమె సోషల్ మీడియా తారకరత్నతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడం ద్వారా అర్థమవుతుంది.

Advertisement

 

 

తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ పని చేశారు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అప్పటికే అలేఖ్య రెడ్డి పెళ్ళై విడాకులు తీసుకుని ఉండటంతో తారకరత్న ప్రేమను ఆయన తండ్రి మోహన్ కృష్ణ అంగీకరించలేదు. దీనితో తారకరత్న పెద్దలను ఎదిరించి మరీ గుడిలో రహస్యంగా అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట ఆర్థిక ఇబ్బందులతో అనేక బాధలు అనుభవించారు.  కానీ వారి ప్రేమ ముందు ఆ బాధలు సైతం ఓడిపోయాయి. మనోధైర్యంతో ఆర్థికంగా నిలదుక్కుకొని వారికంటూ  మంచి జీవితాన్ని ఏర్పరచుకున్నారు.

Advertisement

tarakarathna-parents

tarakarathna-parents

ముగ్గురు పిల్లలతో ఎంతో సంతోషంగా కొనసాగుతున్న వీరి కాపురంపై దేవుడు చిన్నచూపు చూశాడు. ప్రేమతో ఒకటైన ఈ జంట ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని అందమైన కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. తారకరత్న మరణంతో అలేఖ్య రెడ్డి జీవితం ఒక్కసారిగా అంధకారం అయిపోయింది. తారకరత్న బ్రతికి ఉన్నప్పుడే అలేఖ్య రెడ్డిని అత్తమామలు ఆమెను పట్టించుకునేవారు కాదు. తారకరత్న మరణం తర్వాత కూడా అలేఖ్య కుటుంబానికి ఎటువంటి సాయం అందలేదని, అలేఖ్య పిల్లల బాధ్యత ఒంటిరిగా నెరవేరుస్తున్నారని సమాచారం వినిపిస్తుంది. అలేఖ్య రెడ్డి కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకొని కాస్ట్యూమ్ డిజైనర్ వృత్తిని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Pawan Kalyan : పవన్ కళ్యాణ్, విజయ్ కాంబోలో మిస్ అయిన ఈ మూవీ గురించి తెలుసా? ఎందుకు రిలీజ్ కాలేదంటే?

ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ఆగిపోయిన భారీ బడ్జెట్ చిత్రం ఏదో తెలుసా..?

కుమారి 21ఎఫ్, ఆర్ఎక్స్ 100 చిత్రాల మాదిరిగా బేబీ సినిమాలో కూడా ఇదే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా..?

 

Visitors Are Also Reading