Home » ప్ర‌భాస్ ఈవెంట్ కోసం న‌వీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నారో తెలుసా..?

ప్ర‌భాస్ ఈవెంట్ కోసం న‌వీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నారో తెలుసా..?

by Bunty
Ad

ఇది రంగుల ప్రపంచం. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. అలా మారిన పేరే నవీన్ పోలిశెట్టి. ఒక్కప్పుడు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఒక్క సినిమా తరువాత ఈయన బాగా పాపులర్ అయిపోయాడు. ముఖ్యంగా “జాతి రత్నాలు” ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్న నవీన్ పొలిశెట్టి.. ఇటీవల వచ్చిన జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో నవీన్ పర్ ఫామెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా విడుదలై చాలా కాలమే అయినా సినిమా ద్వారా ఆయనకు వచ్చినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.

 

Advertisement

జాతిరత్నాలు సినిమా తరువాత ఈయన అసలు కనిపించలేదు. ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు. ఆఫర్లు రాలేదో..లేక వచ్చినా ఈయనకు నచ్చలేదో తెలియదు. కానీ ఈయన మాత్రం సినిమాలకి సైన్ చేయలేదు. అప్పుడు ఆ మధ్య అనుష్క తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు అన్న టాక్ వచ్చినా.. ఆ తరువాత దానిపై ఎలాంటి ప్రకటన లేదు..క్లారిటీ లేదు. ఇక జనాలు ఈయనను మర్చిపోతున్న టైంలో మళ్ళీ తెర పై కనిపించి సందడి చేసాడు. యాక్టర్ గానే కాదు హోస్ట్ గా ‘రాధేశ్యామ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈయన యాంకర్ గా వ్యవహరించాడు. దీంతో మళ్లీ ఆయన కామెడీ టైమింగ్ చూసి ప్రజలు నవ్వుకున్నారు.

Advertisement

 

ఈవెంట్ కి వచ్చిన ప్రతీ ఒక్కరితో మాట్లాడుతూ.. తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక నటించిన ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర బృందం రామోజీ ఫిల్మ్‌ సిటీలో అభిమానులే అతిథులుగా ముందస్తు విడుదల వేడుక నిర్వహించింది. ఈ ఈవెంట్ లో యాంకరింగ్ చేసినందుకు న‌వీన్ ఎంత తీసుకుని ఉంటారు అనే మ్యాటర్ ఇప్పుడు అందరు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అసలు నవీన్‌ ఈ ఈవెంట్ కి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ప్రభాస్ మీద ఉండే అభిమానంతో వాళ్ల మధ్య ఉండే ఫ్రెండ్ షిప్ తో ఈ ఈవెంట్ కు యాంకర్ గా చేసాడట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు గ్రేట్ నవీన్.. మీ మధ్య ఫ్రెండ్ షిప్ ఇలాగే ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading