రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కు వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కోసం కొత్త కోచ్ వస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటి కే ప్రారంభం అయిందని తెలుస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కు బ్యాటింగ్ కోచ్ గా దక్షిణాఫ్రిక జట్టు క్రికెట్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీని కోసం డివిలియర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
Advertisement
Advertisement
ఐపీఎల్ 2022 కు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిండానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయం ప్రస్తుతం ఆర్సీబీ కోచ్ గా ఉన్న సంజయ్ బంగర్ మాటల ఆధారం గా తెలుస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ యాజమాన్యం జట్టు కు బ్యాటింగ్ కోచ్ గా ఉండాలని డివిలియర్స్ ను సంప్రదించడం తో డివిలియర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయితే ఈ పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఇటీవలే క్రికెట్ కు సంబంధించి అన్ని ఫార్మెట్ల నుంచి రిటైర్ అయ్యాడు. కాగ ఏబీ డివిలియర్స్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగ ఏబీ ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కే ప్రాతనిథ్యం వహించాడు. అలాగే ఆర్సీబీ అనేక విజయాలు అందించాడు.