Home » వైయస్ షర్మిల కు ప్రాణహాని.. వివేకా ఘటన తరహాలోనే?

వైయస్ షర్మిల కు ప్రాణహాని.. వివేకా ఘటన తరహాలోనే?

by Bunty
Ad

 

మాజీ మంత్రి వైయస్ వివేక కేసు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. వివేకా కేసులో జగన్ సూత్రధారి.. అవినాష్ పాత్రధారి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో బుద్ధ వెంకన్న మాట్లాడారు. వివేకా విషయమై ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి…జగన్ గురించే కాదు.. జగన్ వెనుక ఎవరున్నారో కూడా తేలాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement

వివేకా కేసులో సాక్ష్యం చెప్పిన షర్మిళకు ప్రాణహని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్ధ వెంకన్న. ఈ తరుణంలో…కేంద్రం షర్మిళకు వై కేటగిరి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సునీతా రెడ్డి ఉక్కు మహిళ అని… ఓ సైకో సీఎం మీద పోరాడడం మామూలు విషయం కాదని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా కేసు వల్ల ఆ కుటుంబం ఎంత నష్టపోయిందో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంతే నష్టపోయారన్నారు. వివేకా కేసు తర్వాత టీడీపీ ఆరోపణలు చేసి సానుభూతితో ఓట్లేయించుకుని జగన్ గెలిచారన్నారు.

జగన్ గెలవడం వల్లే…ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు….వైఎస్ వివేకా కేసులో షర్మిళ చెప్పినవి వాస్తవాలు అని ఆరోపణలు చేశారు. షర్మిళకు ఎంపీ సీటు ఇవ్వకూడదని జగన్ అనుకున్నారు….షర్మిళ ఎంపీ సీటు కోసం వివేకా పట్టుబట్టారన్నారు. దాంతో వివేకా అడ్డుగా ఉన్నారని హ**** చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్ధ వెంకన్న.

 

Visitors Are Also Reading