Home » BREAKING : టీడీపీ నేత నారా లోకేష్ కు క‌రోనా పాజిటివ్….!

BREAKING : టీడీపీ నేత నారా లోకేష్ కు క‌రోనా పాజిటివ్….!

by AJAY
Ad

దేశవ్యాప్తంగా క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటూ సెల‌బ్రెటీలు రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా భారిన ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీతార‌లు కరోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను సైతం ఈ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇక ఏపీలో ఇప్ప‌టికే మంత్రి కొడాలి నాని,అంబ‌టి రాంబాబు, వంగ‌వీటి రాధ లాంటి వారు క‌రోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

కాగా తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని నారా లోకేష్ స్వ‌యంగా వెల్ల‌డించారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు లేకున్నా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింద‌ని లోకేష్ పేర్కొన్నారు.ప్ర‌స్తుతం ఆయ‌న హోం ఐసోలేష‌న్ లో చికిత్స తీసుకుంటున్న‌ట్టు లోకేష్ పేర్కొన్నారు. త‌న‌ను ఈ మ‌ధ్య క‌లిసిన‌వాళ్లంద‌రూ క‌రోనా టెస్టులు చేసుకోవాల‌ని క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని లోకేష్ పేర్కొన్నారు. ఇక లోకేష్ క‌రోనా బారిన ప‌డ‌టంతో ఆయ‌న అభిమానులు టీడీపీ కార్య‌కర్త‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

Visitors Are Also Reading