Home » లైగర్ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా…? మామూలు రాడ్ సీన్ కాదుగా…!

లైగర్ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా…? మామూలు రాడ్ సీన్ కాదుగా…!

by AJAY
Ad

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ కి జోడిగా నటించింది. అంతే కాకుండా ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి, ఛార్మీ కలిసి నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టైసన్ ముఖ్యమైన పాత్రలో నటించారు.

Advertisement

 

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ముందు నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ మొదటి రోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ మొదలయ్యింది. సినిమా కథ బాగోలేదని….పాటలు అస్సలు బాగోలేదని ప్రేక్షకులు చెపుతున్నారు. అంతే కాకుండా సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఐఎంబిడి లిస్ట్ లో వరస్ట్ సినిమాల లిస్ట్ లో లైగర్ అతి తక్కువ రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

Advertisement

మరోవైపు ఈ సినిమా నిర్మించడానికి చాలా కష్టపడ్డాం అని 20 ఏళ్లుగా సంపాదించింది ఈ సినిమా కోసం ఖర్చు చేశాం అని గతం లో ఛార్మీ ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. దాదాపు గా ఛార్మీ సినిమా కోసం 200 కోట్ల ను ఖర్చు చేసి చేతులు కాల్చుకుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా లో లైగర్ పై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమా విడుదల కు ముందే ట్రోల్స్ మొదలయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమాలోని మిస్టేక్ ను పట్టుకుని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

సినిమా క్లైమాక్స్ లో బాక్సింగ్ రింగ్ లో లైగర్ ఫైట్ చేస్తూ పడిపోతాడు. ఈ మ్యాచ్ వెగాస్ లో జరుగుతుంది. కాగా లైగర్ తల్లి రమ్యకృష్ణ ఇండియాలో టివి చూస్తూ ఉట్నా సాలే అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో బాక్సింగ్ రింగ్ లో ఉన్న లైగర్ లేచి మళ్ళీ ఫైట్ చేస్తాడు. ఇక ఇండియా లో రమ్యకృష్ణ అరిస్తే వేరే దేశం లో ఉన్న లైగర్ కు ఎలా వినపడింది అంటూ నెటిజన్లు ట్రొల్ చేస్తున్నారు. సినిమాలో ఇది పెద్ద రాడ్ సీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : 19 ఏళ్ళకే ఆ నటుడి తమ్ముడితో ప్రేమ పెళ్లి…నటి హేమ లవ్ స్టొరీ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే…!

Visitors Are Also Reading