Home » అన్న‌తో సంబంధం…చివ‌రికి క‌ట్టుకున్న‌వాడిని ఏం చేసిందంటే..?

అన్న‌తో సంబంధం…చివ‌రికి క‌ట్టుకున్న‌వాడిని ఏం చేసిందంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

రోజురోజుకు మాన‌వ‌సంబంధాలు మంట‌గ‌లిసిపోతున్నాయి. మ‌నుషులు మనుషుల్లా కాకుండా జంతువుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. విలువ‌ల‌ను మ‌రిచిపోయి ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా స‌భ్య‌స‌మాజం త‌ల దించుకునే ఘ‌ట‌న క‌ర్నాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. జీవితాంతం క‌లిసి ఉంటాన‌ని ప్రామిస్ చేసి పెళ్లి చేసుకున్న భార్య క‌ట్టుకున్న‌వాడిని కాటికి పంపించింది. అలా భార్య ఎందుకు చేసింది అని పోలీసులు తీగ‌లాగితే డొంకంతా క‌దిలింది.

Advertisement

ఆ కేసు వెన‌క జ‌రిగిన ట్విస్ట్ లు చూసి పోలీసుల మైండే బ్లాక్ అయిపోయింది. త‌న పిన్ని కొడుకుతో సంబంధం పెట్టుకుని భార్య భ‌ర్త‌ను హ‌త‌మార్చిన‌ట్టు విచారాణ‌లో తేలిసింది. ఈ ఘ‌ట‌న గురించి పూర్తివివ‌రాల్లోకి వెళితే….త‌ముకూరు జిల్లాలోని కునిక‌ల్ తాలూకాలోని సీన‌ప్ప‌హ‌ల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. మంజునాథ్ హ‌ర్షిత‌ల‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. హ‌ర్షిత త‌న పిన్ని కుమారుడు అయిన ర‌ఘుతో అక్ర‌మ‌సంబంధం పెట్టుకుంది.

Advertisement

అంతే కాకుండా ఆ త‌ర‌వాత భ‌ర్త‌ను అడ్డుతొల‌గించుకునేందుకు ప్లాన్ వేసింది. త‌న భ‌ర్త‌ను చంపేందుకు హ‌ర్షిత రౌడీల‌కు రూ.5 ల‌క్ష‌లు ఇవ్వ‌డంతో పాటూ త‌న పిన్ని కుమారుడు మ‌రియు అత‌డి స్నేహితుడి స‌హాయంతో భ‌ర్త‌ను రౌడీల‌కు అప్ప‌జెప్పింది. ఆ త‌ర‌వాత రౌడీలు మంజునాథ్ ను హ‌త‌మార్చారు. అనంత‌రం శ‌వాన్ని చెరువులో ప‌డేయ‌డంతో పోలీసులు విచార‌ణ జ‌రిపి నింధితుల‌ను అరెస్ట్ చేశారు.

ALSO READ :ముత్యాల్లాంటి NTR చేతిరాత‌…ప్రింట్ కాదండోయ్! 

Visitors Are Also Reading