ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించినవాళ్లు ఇప్పుడు హీరోలుగా హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. మరి కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా మహేశ్ బాబు హీరోగా నటించిన అతడు సినిమా ప్రతిఒక్కరికీ గుర్తుండి పోయే సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సినిమాలో త్రివిక్రమ్ మాటలు కామెడీ ఎంతగానో అలరించాయి.
ALSO READ : “భీమ్లా నాయక్” లో కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా..ఆఫర్ ఎలా వచ్చిందంటే..!
Advertisement
ఇక ఈ సినిమాలోనూ పలువురు చైల్డ్ ఆర్టిస్ట్ లు నటించి సందడి చేశారు. అయితే వారిలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం ఇప్పటకీ గుర్తిండి పోయాడు. బ్రహ్మనందం కుమారుడిగా నటించిన ఓ కుర్రాడు మీకు కూడా గుర్తు ఉండే ఉంటాడు. బ్రహ్మనందం లగేజ్ తో ఇంటికి వచ్చిన తరవాత నాన్న ట్రైన్ కొనిస్తానని చెప్పావ్….ఎక్కడ ఉంది అని అడుగుతాడు.
Advertisement
దాంతో బ్రహ్మి ఫ్లాట్ మీద ఉంది వెళ్లి తెచ్చుకుపో అని ఆన్సర్ ఇస్తాడు. అమాయకంగా ఆ బుడ్డోడు చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించడంతో పాటూ ఇప్పటికీ అతడి డైలాగ్ మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఆ బుడ్డోడి పేరు దీపక్ సరోజ్….అతడు సినిమాతో పాటూ భద్ర, మిణుగురులు, పెదబాబు, ఆంధృడు సహా మరికొన్ని చిత్రాలలో నటించి ఆకట్టుకున్నాడు.
ఇక ఈ బుడ్డోడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు. వందనం అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా గత బిగ్ బాస్ సీజన్ 5 లోకి దీపక్ సరోజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ అది జరగలేదు….ఇక ఇప్పుడు కార్టూన్ 90స్ అనే సినిమాలోనూ దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వైవా హర్షా కూడా కీలక పాత్రలో నటించాడు.