Home » ఇదెక్క‌డి అభిమానం మావా…ఓవైసీ క్షేమంగా ఉండాల‌ని 101మేక‌లు బ‌లి..!

ఇదెక్క‌డి అభిమానం మావా…ఓవైసీ క్షేమంగా ఉండాల‌ని 101మేక‌లు బ‌లి..!

by AJAY
Ad

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై ఇటీవ‌ల దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డ ఎంఐఎం కూడా పోటీ చేస్తోంది. అయితే ఎన్నిక ల ప్రచారాన్ని ముగించుకున్న త‌ర‌వాత అస‌దుద్దీన్ ఓవైసీ కారుపై ఇద్ద‌రు దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. కాగా కారు డ్రైవ‌ర్ దుండ‌గుల‌పైకి కారును వేగంగా పోనివ్వ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. ఇక కాల్పులు జ‌రిపిన ఇద్ద‌రు దుండ‌గుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. విచార‌ణ‌లో అస‌దుద్దీన్ మ‌త విద్వేశాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని అందువ‌ల్లే కాల్పులు జ‌రిపామ‌ని దుండ‌గులు ఆరోపించారు. మ‌రోవైపు బీజేపీకి సంబంధించిన వారే త‌న‌పై కాల్పులు జ‌రిపించార‌ని అస‌దుద్దీన్ ఆరోపించారు.

Advertisement

asaduddin owaisi

asaduddin owaisi

గాంధీని చంపిన వారే త‌న‌నూ చంపాల‌ని చూసార‌ని కామెంట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అస‌దుద్దీన్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ 101 మేకలను ఆయ‌న అభిమాని బ‌లిచ్చారు. హైదరాబాద్‌లోని బాగ్ ఎజహనారా వద్ద కార్యక్రమం నిర్వహించిన అభిమాని 101 మేక‌ల‌ను బ‌లిచ్చాడు. దాంతో సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వ‌స్తున్నాయి. మేక‌ల‌ను చంపితే అస‌దుద్దీన్ ఎలా క్షేమంగా ఉంటారు..సెక్యురిటీ పెంచుకుంటే క్షేమంగా ఉంటార‌ని కామెంట్లు పెడుతున్నారు. మరి కొంత‌మంది కోస్తే కోసారు మాక్కూడా 2కేజీలు ఇస్తే బాగుండేది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading