తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దాదాపు ముగిసిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు రాబోతున్నాయి. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు అయింది. అంటే ఓవరాల్ గా భారత రాష్ట్ర సమితి పార్టీకి 40 సీట్లు రాబోతున్నాయి. అధికార పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి పార్టీ చేసిన కొన్ని ప్రధాన తప్పిదాల వల్ల ఈ ఎన్నికలలో ఓటమి చవిచూసింది.
అయితే తమ పార్టీ ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చారు… దానికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈసారి కొన్ని తప్పిదాల వల్ల తాము ఓడిపోయామని వెల్లడించారు. మా తప్పిదాలను కచ్చితంగా సమీక్షించుకుంటాం… మళ్లీ తెలంగాణలో పుంజుకుంటామని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
Advertisement
అయితే కేటీఆర్ చేసిన ట్వీట్ పై యాంకర్ అనసూయ స్పందించింది. మీరు గ్రేట్ సార్… మీరంటే మాకు ప్రేమ అంటూ అనసూయ వెల్లడించింది. ఇప్పటివరకు మీరు చాలా అద్భుతంగా తెలంగాణను అభివృద్ధి చేశారు.. హైదరాబాద్ మహా నగరాన్ని అగ్రస్థానంలో నిలిపారు. ఇక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రను మీరు చాలా సమర్థవంతంగా పోషించాలని అనసూయ కోరింది. తెలంగాణ ప్రజల పట్ల ఖచ్చితంగా మీరు నిలబడాలని అనసూయ వెల్లడించింది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!