Home » నాగార్జునకు రైతు బంధు డబ్బులు అవసరమా… ఐఎఎస్ అధికారి షాకింగ్ కామెంట్స్…!

నాగార్జునకు రైతు బంధు డబ్బులు అవసరమా… ఐఎఎస్ అధికారి షాకింగ్ కామెంట్స్…!

by AJAY
Ad

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన ప‌థ‌కం రైతు బంధు. ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒకసారి ఎక‌రానికి రూ.5వేల చొప్పున ప్ర‌భుత్వం రైతుల ఖాతాలో జ‌మ‌చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌థ‌కానికి లిమిట్ అనేది లేదు. వంద‌ల ఎక‌రాలు ఉన్న రైతుల‌కు సైతం ఈ ప‌థ‌కం ద్వారా డ‌బ్బులు అందిస్తున్నారు.

 

nagarjuna ap tickets issueదాంతో ప్ర‌జాధ‌నం వృధా అవుతోంది. ఇప్ప‌టికే ఈ ప‌థకం అమ‌లులో కొన్ని కండిషన్స్ పెట్టాల‌ని చాలా మంది మేధావులు చెప్పారు. అయితే తాజాగా ఇదే విష‌యం పై ఓ ఇంట‌ర్వ్యూలో ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి స్పందించారు. అంతే కాకుండా ఆయ‌న ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ హీరో నాగార్జున సైతం ఈ ప‌థ‌కం ద్వారా లబ్ది పొందుతున్నార‌ని ఆకునూరి ముర‌ళి వ్యాఖ్యానించారు.

Advertisement

Advertisement

NAGARJUNA

NAGARJUNA

నాగార్జున‌కు రైతు బంధు డ‌బ్బులు ఎందుకు అంటూ ప్ర‌శ్నించారు. అమెరికాలో ముప్పై ఏళ్లుగా ప‌నిచేస్తున్న వ్య‌క్తికి తెలంగాణ‌లో వంద‌ల ఎక‌రాలు ఉంటే ఆయ‌న‌కు రైతు బంధు డ‌బ్బులు ఎందుకు ఇవ్వాల‌ని ప్ర‌శ్నించారు. సంప‌న్న వ‌ర్గాల‌కు సైతం రైతు బంధు డ‌బ్బులు ఇవ్వ‌డంలో ఆంత‌ర్యం ఏంటి అంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో వంద‌ల ఎక‌రాలు ఉన్నవాళ్లు ల‌క్ష‌ల్లో ల‌బ్ది పొందుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading