మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శత్వం వహించారు. ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. అదే విధంగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించాడు. కాగా చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది.
ఈ చిత్రాన్ని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ మరియు నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు మరియు టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 4 న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా విడుదల ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
The release of #Acharya stands postponed due to the pandemic.
The new release date would be announced soon.
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/oVjqcvfl9U
— Konidela Pro Company (@KonidelaPro) January 15, 2022