Home » శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు..ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాం : డిస్కో శాంతి

శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు..ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాం : డిస్కో శాంతి

by Bunty

అలనాటి నటుడు శ్రీహరి గురించే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా, హీరోగా ఎదుగుతూ వచ్చాడు. సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఎవరికైనా ఆపద ఉందంటే అక్కడ ముందుండేవాడు శ్రీహరి. తనకు చేతనైనంత సహాయం చేసేవాడు. అలాంటి గొప్ప నటుడు అనారోగ్య కారణాలతో మరణించడం చాలా బాధాకరం. అతని మరణానికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తన భార్య ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.

తన భర్తకి తప్పుడు ట్రీట్మెంట్ చేశారని, అందుకే శ్రీహరి మరణించాడని ఇప్పటికే చెబుతూనే ఉంటుంది. తన భర్త చనిపోయిన అనంతరం డిస్కో శాంతి తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని గడుపుతోంది. శ్రీహరి చనిపోయాక చాలా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పిల్లలను గొప్ప చదువులు చదివించడానికి కూడా తగినంత డబ్బు తన వద్ద లేదని డిస్కో శాంతి ఆరోపించారు. తాజాగా తాను, తన పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తనకు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని చెప్పుకొచ్చారు. చాలామంది శ్రీహరికి డబ్బు ఇవ్వాల్సి ఉన్నా…. కూడా ఇవ్వడం లేదని అవి ఎవరి వద్ద ఉన్నాయో కూడా తనకు తెలియదని శాంతి చెప్పుకొచ్చింది.

మమ్మల్ని మోసం చేశారని తెలిపారు. తన వద్ద ఉన్న నగలు, పొలాలు, కార్లు అమ్మేసి అప్పులు తీర్చుకున్నామని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు కొంత రోడ్డు భాగంలో పోతే ప్రభుత్వం తరపున కొంత డబ్బు వచ్చిందని, ఆ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వారికి ఉన్న మరో రెండు ఇల్లుల నుంచి రెంటు వస్తే అవే డబ్బులు వారికి ఆదాయం అని డిస్కో శాంతి చెప్పారు. అంతేకాకుండా సినిమాల్లో తనకి అవకాశం ఇస్తే నటిస్తానని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన శ్రీహరి ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చాలా బాధపడుతున్నారు. శ్రీహరి కుటుంబానికి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందా అని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

 

ఇవి కూడా చదవండి 

NTR : ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు ఇంత కథ జరిగిందా !!

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

కీర్తి సురేష్ జాతకం ఇంత ఘోరమా…ఏది ముట్టుకున్నా నాశనమే ?

Visitors Are Also Reading