Home » 2023లో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన టాలీవుడ్ సినిమాలు ఇవే !

2023లో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన టాలీవుడ్ సినిమాలు ఇవే !

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమా సినిమాలు హిట్ అవడం అలాగే ఫ్లాప్ కావడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. చిన్న హీరోల సినిమాలు మాత్రం హిట్ అవుతున్నాయి. అయితే ఈ ఏడాది నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకువచ్చిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బోలా శంకర్

మెగాస్టార్ చిరంజీవి మరియు తమన్నా భాటియా నటించిన భోళాశంకర్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లు వసూలు చేస్తే హిట్ అయినట్టు. కానీ 27 కోట్లు మాత్రమే షేర్ రాబట్టగలిగింది. అంటే దాదాపు 53 కోట్ల నష్టాలను తీసుకువచ్చింది బోలాశంకర్ సినిమా.

శాకుంతలం
హీరోయిన్ సమంత మరియు దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన సినిమానే శకుంతలం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా నటించింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడమే కాకుండా… నిర్మాతలకు 45 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

aadipurush

Advertisement

ఆది పురుష్
రెబల్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఆది పురుష్. ఈ సినిమా ఏకంగా 42 కోట్ల నష్టాలను మిగిల్చింది.

బ్రో సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో. ఇంత పెద్ద హీరోలు ఇద్దరు నటించినప్పటికీ ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఓవరాల్ గా 34 కోట్ల నష్టాలను నిర్మాతలకు తీసుకువచ్చింది.

ఏజెంట్

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ సినిమా కూడా నిర్మాతలకు 30 కోట్ల నష్టాలను మిగిల్చడం గమనార్హం.

Custody

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మరియు కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన కస్టడీ సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది.

ఇవి కూడా చదవండి 

పాండ్యా బిగ్ షాక్…టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్‌ బుమ్రా!

Virat Kohli : క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ?

Visitors Are Also Reading