ప్రముఖ తెలుగు ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో వేణు స్వామికి భారీగానే ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం ఆయన చెప్పే జ్యోతిష్యం. వేణు స్వామి ఇప్పటివరకు చెప్పిన వాటిలో నూటికి 95% జరిగాయి. ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన జంటలు విడిపోతాయని… అలాగే హీరోయిన్ల కెరీర్ విషయాలను చెప్పడంలో చాలా సక్సెస్ అయ్యారు జ్యోతిష్యుడు వేణు స్వామి.
సమంత మరియు అక్కినేని నాగచైతన్య విడిపోతారని… అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అవుతుందని వేణు స్వామి ముందే చెప్పాడు. అలాగే నయనతార వివాహం తర్వాత కూడా చిక్కులు ఎదుర్కొంటుందని వేణు స్వామి ముందే చెప్పేశాడు. అటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో 2023 సంవత్సరంలో యంగ్ హీరో మరణిస్తాడని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే నందమూరి తారకరత్న మరణించాడు.
Advertisement
Advertisement
అయితే తాజాగా మరో బాంబు పేల్చాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. అక్కినేని నాగచైతన్య మరియు సమంత లాగే మరో జంట విడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వేణు స్వామి. ఆది పినిశెట్టి మరియు నిక్కి గల్రాని జంట త్వరలోనే విడిపోవడం ఖాయం అంటూ పేర్కొన్నాడు వేణు స్వామి. వందకు 80% వారిద్దరూ విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు… సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి
Nara Lokesh : బ్రాహ్మణితో లోకేష్ ప్రేమాయణం.. బాలయ్యకు భయపడి పాపం ?
హీరోయిన్ రాశి ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్ ఆడుకో !